Cyber Congress: ముగిసిన సైబర్ కాంగ్రెస్. తెలంగాణవ్యాప్తంగా పెరగనున్న సైబర్ అంబాసిడర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Congress: రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు 10 నెలల పాటు నిర్వహించిన సైబర్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ నిన్న గురువారం ముగిసింది. ఇందులో భాగంగా సైబర్ సేఫ్టీపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ట్రైనింగ్ పొందిన మెంబర్లను సైబర్ అంబాసిడర్లుగా పేర్కొంటారు. వీళ్లు తమ పరిధిలోని విద్యార్థులకు, బంధుమిత్రులకు, చుట్టుపక్కలవాళ్లకు సైబర్ భద్రతకు సంబంధించిన టిప్స్ నేర్పుతారు. తద్వారా వాళ్లను ఆన్లైన్ మోసాల బారిన పడకుండా సేవ్ చేస్తారు.
సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించారు. జిల్లాకి 100 మంది విద్యార్థులను, 50 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వాళ్లకు వివిధ అంశాలను బోధించారు. ఇంటర్నెట్ దొంగలు బెదిరింపులకు పాల్పడ్డప్పుడు, వెంబడించినప్పుడు సురక్షితంగా ఎలా బయటపడాలి?, దీనికి సంబంధించిన చట్టపరమైన రక్షణలు తదితర విషయాలను వివరించారు. ఈ మేరకు 80 వర్చువల్ ట్రైనింగ్ సెషన్లను నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాల వివరాలను తెలంగాణ పోలీస్ శాఖ మహిళల భద్రతా విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా వెల్లడించారు.
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
Ukraine in Top: నమ్మబుద్ధి కాని నిజం. టాప్లో నిలిచిన ఉక్రెయిన్.
ఈ ప్రోగ్రామ్ను ఈ ఏడాది కూడా ఏర్పాటుచేస్తామని స్వాతి లక్రా తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు చెందిన 400 మంది సైబర్ అంబాసిడర్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము నేర్చుకున్న అంశాలను వెల్లడించారు. ”ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను రిస్క్ లేకుండా ఎలా వాడాలి?, మొబైల్ ఫోన్లకు వచ్చిన పాస్వర్డ్లను, ఓటీపీలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అనే విషయాలపై పట్టు సాధించాం.
‘సోషల్’గా యాక్టివ్ అయ్యాం. ఇక నుంచి సైబర్ సేఫ్టీపై అలర్ట్గా ఉంటాం. ఇంటర్నెట్లో ఏది రియల్, ఏది ఫేక్ అనేది తెలుసుకున్నాం. సేఫ్గా బ్రౌజింగ్ చేయటం నేర్చుకున్నాం. అందువల్ల ఇప్పుడు ధైర్యంగా ఆన్లైన్ యాక్టివిటీస్ నిర్వహించగలం. మేం పొందిన ఈ నాలెడ్జ్ని ఇతరులతో షేర్ చేసుకుంటాం. ఇప్పటికే కొంత మందికి నేర్పాం. లోన్ యాప్ల ట్రాప్లో పడకుండా ఉండటం, మన ప్రైవేట్ డేటాను రక్షించుకోవటం గురించి సూచనలు సలహాలు ఇస్తున్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో పాల్గొనాలని మా ఫ్రెండ్స్కి కూడా చెబుతాం” అని అన్నారు.
తాజావార్తలు
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!