Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- ప్రేమ వ్యవహారం.. ప్రాణాలు తీసిన పగ
- ఏడుగురు యువకులతో దాడి.. కత్తులతో వెంటాడి హత్య
- తల, మెడపై 15 కత్తిపోట్లు.. అక్కడికక్కడే మృతి
- నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా ఒక యువకుడిని ప్రత్యర్థులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి ప్రాణాలు తీశారు. ఇందిరానగర్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్లోని యాప్రాల్కు చెందిన యువన్ అలియాస్ అఖిల్ (21), మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. యువన్ గతంలో చిలకలగూడలోని ఇందిరానగర్లో నివసించేవాడు. అక్కడే ఒక యువతితో గత ఐదేళ్లుగా అతడికి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం యాప్రాల్లో ఉంటున్నప్పటికీ, తరచూ ఆ యువతిని కలిసేందుకు యువన్ చిలకలగూడకు వస్తుండేవాడు.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో యువన్ తన మిత్రులతో కలిసి ఇందిరానగర్లో మొబైల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై సుమారు ఏడుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. వారు యువన్తో గొడవకు దిగి, ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కత్తులతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Also Read
- Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
- Indian Student: ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. ఉజ్బెకిస్తాన్లో భారతీయ విద్యార్థిని హత్య..?
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
నిందితులు యువన్ను వెంటాడి మరీ దాడికి పాల్పడ్డారు. తల, మెడ, చేతులపై సుమారు 15 చోట్ల కత్తులతో పొడవడంతో యువన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితుల్లో సదరు యువతి సోదరులు , వారి స్నేహితులు ఉన్నట్లు సమాచారం. తమ సోదరితో యువన్ ప్రేమలో ఉండటం ఇష్టం లేని వారు, పక్కా పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో యువకుడిని ఇంత దారుణంగా హత్య చేయడంపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!