Cellphone Crime: సెల్ఫోన్ కోసం యువతి ప్రాణాలు తీశారు.. కదులుతున్న రైలు నుంచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Girl Preethi Dies After Falling From Train: కేవలం ఒక సెల్ఫోన్ కోసం ఇద్దరు దుర్మార్గులు ఓ యువతి ప్రాణాలు తీసేశారు. కదులుతున్న రైలు నుంచి ఆమెని తోసేశారు. చివరికి ఆ యువతి మృత్యువుతో పోరాడుతూ.. ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో.. పోలీసులు కేసుని సీరియస్గా తీసుకొని, ఆ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చైన్నెలోని కందన్చావడిలో తిరువిక వీధికి చెందిన ప్రీతి(22) అనే యువతి కొట్టూరుపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఎప్పట్లాగే జులై 2వ తేదీన తన పని ముగించుకొని, సాయంత్రం సబర్బన్ రైలులో ఇంటికి బయలుదేరింది. తాను ఒక చోట కూర్చొని, సెల్ఫోన్ చూసుకుంటోంది.
Posani Krishna Murali: పవన్ కళ్యాణ్కి పోసాని సవాల్.. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలి
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
సరిగ్గా అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతి వద్దకు వచ్చి, ఆమె సెల్ఫోన్ దొంగలించడానికి ప్రయత్నించారు. ఆమె చేతిలో నుంచి లాక్కోవడానికి ట్రై చేశారు. అయితే.. ప్రీతి వెంటనే ప్రతిఘటించింది. ఆ ఇద్దరితో గొడవకు దిగింది. కోపాద్రిక్తులైన ఆ ఇద్దరు వ్యక్తులు.. రైలు ఇందిరా నగర్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఆమెను కిందకు నెట్టేశారు. కదులుతున్న రైలు నుంచి కిందకు పడటంతో.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు, రైల్వే పోలీసులు వెంటనే ప్రీతిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ప్రీతిని తోసేసిన ఆ ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. శనివారం వరకు మృత్యువుతో పోరాడిన ప్రీతి, శనివారం ఉదయం తుదిశ్వాస విడిచింది. గాయాలు చాలా తీవ్రంగా తగలడం వల్లే.. ప్రీతి మృత్యువాత పడింది.
Sudigali Sudheer: బీచ్ లో ‘గాలోడు’.. రష్మీనే ఫోటో తీసింది.. ?
కూతురు మృతితో ప్రీతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఉద్యోగం చేసుకుంటూ తమకు ఆసరాగా నిలిచిన నిలిచిన కూతురు ఇలా తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడంతో, వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు.. ప్రీతి మరణవార్త తెలుసుకుని, పోలీసులు తమ దర్యాప్తుని మరింత వేగవంతం చేశారు. రైల్వేస్టేషన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. ఎట్టకేలకు ఆ ఇద్దరి ఆచూకీ కనుగొని, అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల్ని విఘ్నేష్ (27), మణిమారన్ (26)గా గుర్తించారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!