Madhyapradesh Bus Accident: ఘోరప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు, 13 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh Bus Accident: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖాల్ఘాట్ దగ్గర సంజయ్ సేతుపై నుంచి మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన బస్సు నర్మదా నదిలో పడిపోయిన ఘటనలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు అదుపుతప్పి వంతెన రైలింగ్ను ఢీకొని నదిలో పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 నుంచి 55 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
Telangana Rains: తెలంగాణను వీడని వానలు. నేడు భారీ వర్షాలు
Also Read
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
సమాచారమందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 13 మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు 15మందిని ప్రమాదం నుంచి రక్షించారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 15 మందిని కాపాడినట్లు, మిగతావారి కోసం గాలింపు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికి తీశారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందన్నారు. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడానన్నారు. తాము సాధ్యమైనంత వరకు సహాయక చర్యలు చేపట్టామని, ప్రమాదానికి సంబంధించి విచారణకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించాలని మంత్రి కమల్ పటేల్ను కూడా ఆదేశించామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
ధార్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదం ధార్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం మహారాష్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తాను జిల్లా కలెక్టర్, అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు జరుగుతున్నాయని.. స్థానిక అధికారులు ఈ ఘటనలో బాధితులకు అన్ని రకాల సాయాన్ని అందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Maharashtra CM Eknath Shinde has instructed MSRTC (Maharashtra State Road Transport Corporation) to provide ex gratia of 10 lakhs each to the kin of the deceased in the MSRTC bus accident in Narmada river: Maharashtra Chief Minister's Office (CMO)
(File photo) pic.twitter.com/WafZXbdYdz
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022
తాజావార్తలు
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!