Mumbai: లోకల్ ట్రైన్ లో మహిళల కంపార్ట్మెంట్లో విన్యాసాలు.. వ్యక్తి అరెస్ట్..
- నిందితుడిని గుజరాత్లోని వల్సాద్ నివాసి నాథు గోవింద్ హంసాగా గుర్తింపు
- మహిళల కంపార్ట్మెంట్ పక్కన ఉన్న
- లగేజీ సెక్షన్ ఫుట్బోర్డ్పై ప్రయాణించిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్ లో 35 ఏళ్ల వ్యక్తి లోకల్ ట్రైన్ లోని మహిళల కంపార్ట్మెంట్లో విన్యాసాలు చేసి, మహిళలను వేధిస్తున్నాడు. దీంతో రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. లోకల్ ట్రైన్ లోని మహిళల కంపార్ట్మెంట్ లో విన్యాసాలు చేస్తూ.. మహిళలను ఇబ్బంది పెడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు గుజరాత్లోని వల్సాద్ నివాసి నాథు గోవింద్ హంసాగా గుర్తించినట్లు బోరివాలి రైల్వే పోలీసులు వెల్లడించారు. లోకల్ రైలులో హంస మహిళలను వేధిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళల కంపార్ట్మెంట్ పక్కన ఉన్న లగేజీ సెక్షన్ ఫుట్బోర్డ్పై నిందితుడు ప్రయాణిస్తున్నట్లు వీడియో కనిపించింది. ఓ ప్రయాణీకుడు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లో బంధించాడు, తరువాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
మహిళా ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యత అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించమని నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకునేలా అటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే వెంటనే నివేదించాలని వారు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!