KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KMM CYBER CASE: ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన వెయ్యికోట్ల సైబర్ చీటింగ్ కేసులపై సిట్ ఏర్పాటైంది. సైబరాసురులు ఆడిన రాక్షస క్రీడను.. అమాయకుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు వాడిన తీరును సిట్ బృందం వెలికి తీయనుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే ఉన్న కేసులను స్వాధీనం చేసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి ముందుకు వెళ్లనుంది. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.1,000 కోట్లకు పైగా సైబర్ మోసాల కేసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నమోదైన రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి సిట్ టీమ్ దర్యాప్తు ప్రారంభించింది.
ఖమ్మం జిల్లా వి.ఎం. బంజారా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో పాటు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై సిట్ లోతైన విచారణ చేపట్టనుంది. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ విచారణ బాధ్యతలు అప్పగించారు. ప్రతి వారం దర్యాప్తు పురోగతి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.
Also Read
- Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
- Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
- Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా...
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించారు కొంత మంది కేటుగాళ్లు. ఆ ఖాతాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అలా తమ చేతుల్లో ఉన్న ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగించారు. దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ మోసాల సొమ్మును ఆయా ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.1,000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడివే అంశాలను సిట్ వెలికి తీయనుంది. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ సైబర్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్టు అయ్యారు. మిగిలిన నిందితులు, వారికి సహకరించిన వ్యక్తులు, కంపెనీలు, బ్యాంకు ఖాతాల నెట్వర్క్పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి సారించింది. దర్యాప్తు వేగవంతం కావడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోత్రు ప్రవీణ్ ఉన్నాడు. పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు, జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్.. ఈ భారీ చీటింగ్లో ఇతర నిందితులుగా ఉన్నారు.
- Tags
- Be Alert
- crime
- NTV Telugu
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!