Tragedy: టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద మృతి
- 31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ మేఘరాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి
- వాష్రూమ్కి వెళ్లి తిరిగి మేఘరాజ్..
- తలుపు లాక్ చేయడంతో..పగలగొట్టి బయటకు తీసిన స్నేహితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని పబ్ టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను స్నేహితులతో కలిసి పబ్కి వెళ్లి భోజనం చేసిన తర్వాత వాష్రూమ్కి వెళ్లి తిరిగి రాలేదు. సీసీటీవీ ఫుటేజ్లో అతను లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసినట్లు కనిపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరి నగర్లోని ఒక పబ్లో 31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ మేఘరాజ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మేఘరాజ్ ముగ్గురు స్నేహితులతో కలిసి తినడానికి, తాగడానికి పబ్కి వెళ్లాడని పోలీసులు తెలిపారు. బిల్లు చెల్లించిన తర్వాత, వాంతులు చేసుకుంటున్నట్లు అనిపించడంతో వాష్రూమ్కి వెళ్లాడు. ఈ సమయంలో, అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతను చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో, వారు పబ్ సిబ్బందికి సమాచారం అందించారు. మేఘరాజ్ వాష్రూమ్కి వెళ్లి తలుపు లాక్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది.
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
“కొంతసేపు వేచి ఉన్న తర్వాత, ముగ్గురు స్నేహితులు మేఘరాజ్ కోసం మళ్ళీ వెతుకుతూ పైకి వెళ్లారు. సీసీటీవీ చూసిన తర్వాత, అతను వాష్రూమ్కి వెళ్లి లోపల తాళం వేసుకున్నట్లు తేలింది. తలుపు పగలగొట్టి చూసేసరికి, అతను చనిపోయాడని తేలింది” అని డీసీపీ గిరీష్ తెలిపారు.
ఉద్యోగులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అతను లోపల అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. మరణానికి అసలు కారణం పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే తెలుస్తుందని డీసీపీ వెల్లడించారు. మృతుడి సోదరుడు వినయ్ ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 174 (సి) కింద అసహజ మరణం కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పుకొచ్చారు. పోస్టుమార్టం తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని డిసిపి గిరీష్ తెలిపారు.
జూన్ 22, 2019న చర్చి స్ట్రీట్లోని బీర్ పబ్ కిటికీలోంచి మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తూ పడి మార్కెటింగ్ మేనేజర్ మరియు అతని మహిళా స్నేహితురాలు మరణించారు. మృతులను మీడియా హౌస్లో మార్కెటింగ్ మేనేజర్ పవన్ అత్తవర్ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేద ఆర్ యాదవ్గా గుర్తించారు.
తాజావార్తలు
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!