Tragedy: టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద మృతి
- 31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ మేఘరాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి
- వాష్రూమ్కి వెళ్లి తిరిగి మేఘరాజ్..
- తలుపు లాక్ చేయడంతో..పగలగొట్టి బయటకు తీసిన స్నేహితులు
బెంగళూరులోని పబ్ టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను స్నేహితులతో కలిసి పబ్కి వెళ్లి భోజనం చేసిన తర్వాత వాష్రూమ్కి వెళ్లి తిరిగి రాలేదు. సీసీటీవీ ఫుటేజ్లో అతను లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసినట్లు కనిపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరి నగర్లోని ఒక పబ్లో 31 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ మేఘరాజ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మేఘరాజ్ ముగ్గురు స్నేహితులతో కలిసి తినడానికి, తాగడానికి పబ్కి వెళ్లాడని పోలీసులు తెలిపారు. బిల్లు చెల్లించిన తర్వాత, వాంతులు చేసుకుంటున్నట్లు అనిపించడంతో వాష్రూమ్కి వెళ్లాడు. ఈ సమయంలో, అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతను చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో, వారు పబ్ సిబ్బందికి సమాచారం అందించారు. మేఘరాజ్ వాష్రూమ్కి వెళ్లి తలుపు లాక్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది.
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
“కొంతసేపు వేచి ఉన్న తర్వాత, ముగ్గురు స్నేహితులు మేఘరాజ్ కోసం మళ్ళీ వెతుకుతూ పైకి వెళ్లారు. సీసీటీవీ చూసిన తర్వాత, అతను వాష్రూమ్కి వెళ్లి లోపల తాళం వేసుకున్నట్లు తేలింది. తలుపు పగలగొట్టి చూసేసరికి, అతను చనిపోయాడని తేలింది” అని డీసీపీ గిరీష్ తెలిపారు.
ఉద్యోగులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అతను లోపల అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. మరణానికి అసలు కారణం పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే తెలుస్తుందని డీసీపీ వెల్లడించారు. మృతుడి సోదరుడు వినయ్ ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 174 (సి) కింద అసహజ మరణం కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పుకొచ్చారు. పోస్టుమార్టం తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని డిసిపి గిరీష్ తెలిపారు.
జూన్ 22, 2019న చర్చి స్ట్రీట్లోని బీర్ పబ్ కిటికీలోంచి మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తూ పడి మార్కెటింగ్ మేనేజర్ మరియు అతని మహిళా స్నేహితురాలు మరణించారు. మృతులను మీడియా హౌస్లో మార్కెటింగ్ మేనేజర్ పవన్ అత్తవర్ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేద ఆర్ యాదవ్గా గుర్తించారు.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో