‘విక్రమార్కుడు’ సీన్ రిపీట్.. లక్ష్మీదేవి కోపంగా ఉంది.. ఆ పని చేస్తే మూట లోపలికి తోస్తది అంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలను చూసి క్రైమ్ జరుగుతుందో.. క్రైమ్ చూసి సినిమాలు తీస్తున్నారో అర్ధం కావడం లేదు. అచ్చు గుద్దినట్లు సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలో జరుగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రం అందరు చూసే ఉంటారు. అందులో రవితేజ.. దొంగబాబా అవతారం ఎత్తి హరోం హర అత్తిలి చిదబర.. అంటూ కొందరి ఇళ్లకు వెళ్లి .. తనను తాను గొప్ప మహర్షిగా చెప్పుకుంటూ.. లక్ష్మీ దేవి మూట లోపలికి తోస్తది అందరికీ చెప్తూ వారందరికీ అర గుండ్లు కొట్టిస్తాడు. ఈ సీన్ అందరికి నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి సీనే పానీపట్ లో రిపీట్ అయ్యింది. లక్ష్మీదేవి లోపలి రావాలంటే..నగలు అన్ని తీసి మూటకట్టి తూర్పు తిరిగి దండం పెట్టాలని మాయమాటలు చెప్పి ఓ మహిళ ఒంటి మీద ఉండే బంగారం పర్సులోని డబ్బు చివరికి తాళి బొట్టును కూడా తీసి పట్టుకుపోయారు దొంగ బాబాలు..
వివరాలలోకి వెళితే.. హరియాణాలోని పానిపట్లో ఓ మహిళ, కుటుంబంతో సహా నివసిస్తోంది. గతకొన్నిరోజులుగా ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో పక్కింటి వారి వద్ద అప్పు తీసుకొని హాస్పిటల్ కి బయల్దేరింది. అక్కడికి వెళ్ళాకా మెడికల్ షాపులో మందులు తీసుకుందామని వెళ్తుండగా ఆమెకు ఇద్దరు స్వామీజీలు కనిపించారు.. తాము గొప్ప స్వాములమని, నీకున్న కష్టాలు అన్ని తమకు తెలుసని నమ్మబలికారు. అంతేకాకుండా లక్ష్మీదేవి నీ మీద కోపంగా ఉందని చెప్పడంతో నమ్మిన మహిళ.. లక్ష్మీ దేవి కోపం పోవాలంటే ఏం చేయాలనీ అడిగింది. దీంతో దొంగ బాబాలు తన ఒంటి మీద ఉండే నగలు తన దగ్గర ఉన్న డబ్బును ఓ మూటగా కట్టి తమకు ఇవ్వాలని, అనంతరం వారు ఉన్న చోటు నుంచి తూర్పుగా 81 అడుగుల దూరం వెళ్లి లక్ష్మీ దేవిని మనసులో ప్రార్థించి తిరిగి రావాలని చెప్పారు.
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
ఇలా చేస్తే అమ్మ కోపం తగ్గతుందని చెప్పారు. ఆ మాయమాటలు నమ్మిన మహిళా స్వాములు చెప్పినట్లు చేసింది. వెనక్కి వచ్చాకా అక్కడ ఎవరు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారిని అడిగింది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!