‘విక్రమార్కుడు’ సీన్ రిపీట్.. లక్ష్మీదేవి కోపంగా ఉంది.. ఆ పని చేస్తే మూట లోపలికి తోస్తది అంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలను చూసి క్రైమ్ జరుగుతుందో.. క్రైమ్ చూసి సినిమాలు తీస్తున్నారో అర్ధం కావడం లేదు. అచ్చు గుద్దినట్లు సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలో జరుగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రం అందరు చూసే ఉంటారు. అందులో రవితేజ.. దొంగబాబా అవతారం ఎత్తి హరోం హర అత్తిలి చిదబర.. అంటూ కొందరి ఇళ్లకు వెళ్లి .. తనను తాను గొప్ప మహర్షిగా చెప్పుకుంటూ.. లక్ష్మీ దేవి మూట లోపలికి తోస్తది అందరికీ చెప్తూ వారందరికీ అర గుండ్లు కొట్టిస్తాడు. ఈ సీన్ అందరికి నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి సీనే పానీపట్ లో రిపీట్ అయ్యింది. లక్ష్మీదేవి లోపలి రావాలంటే..నగలు అన్ని తీసి మూటకట్టి తూర్పు తిరిగి దండం పెట్టాలని మాయమాటలు చెప్పి ఓ మహిళ ఒంటి మీద ఉండే బంగారం పర్సులోని డబ్బు చివరికి తాళి బొట్టును కూడా తీసి పట్టుకుపోయారు దొంగ బాబాలు..
వివరాలలోకి వెళితే.. హరియాణాలోని పానిపట్లో ఓ మహిళ, కుటుంబంతో సహా నివసిస్తోంది. గతకొన్నిరోజులుగా ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో పక్కింటి వారి వద్ద అప్పు తీసుకొని హాస్పిటల్ కి బయల్దేరింది. అక్కడికి వెళ్ళాకా మెడికల్ షాపులో మందులు తీసుకుందామని వెళ్తుండగా ఆమెకు ఇద్దరు స్వామీజీలు కనిపించారు.. తాము గొప్ప స్వాములమని, నీకున్న కష్టాలు అన్ని తమకు తెలుసని నమ్మబలికారు. అంతేకాకుండా లక్ష్మీదేవి నీ మీద కోపంగా ఉందని చెప్పడంతో నమ్మిన మహిళ.. లక్ష్మీ దేవి కోపం పోవాలంటే ఏం చేయాలనీ అడిగింది. దీంతో దొంగ బాబాలు తన ఒంటి మీద ఉండే నగలు తన దగ్గర ఉన్న డబ్బును ఓ మూటగా కట్టి తమకు ఇవ్వాలని, అనంతరం వారు ఉన్న చోటు నుంచి తూర్పుగా 81 అడుగుల దూరం వెళ్లి లక్ష్మీ దేవిని మనసులో ప్రార్థించి తిరిగి రావాలని చెప్పారు.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ఇలా చేస్తే అమ్మ కోపం తగ్గతుందని చెప్పారు. ఆ మాయమాటలు నమ్మిన మహిళా స్వాములు చెప్పినట్లు చేసింది. వెనక్కి వచ్చాకా అక్కడ ఎవరు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారిని అడిగింది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
-
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!