Ayodhya Gangrape Case: అయోధ్య గ్యాంగ్ రేప్ కేసులో 12 ఏళ్ల బాలికకు అబార్షన్.. డీఎన్ఏ పరీక్ష..
- యూపీ రాజకీయాల్లో సంచలనంగా అయోధ్య గ్యాంగ్రేప్ కేసు..
- 12 ఏళ్ల బాలికకు అబార్షన్.. డీఎన్ఏ పరీక్ష..
- నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ నేత..
Ayodhya Gangrape Case: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడైన మోయిద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కీలక నేతగా ఉన్నారు. ఇతను భద్రస నగర ఎస్పీ అధ్యక్షుడు. ఇతడితో పాటు ఇతనికి సంబంధించిన ఖాన్ బేకరీలో పనిచేసే రాజు ఖాన్ మరో నిందితుడు. దీంతో ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిందితుడి బేకరీని, ఆస్తుల్ని యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేసింది. నిందితుడు మోయిద్ ఖాన్, ఇటీవల లోక్సభ ఎన్నికల్లో అయోధ్య ఫైజాబాద్ నుంచి గెలిచిన ఎస్పీ నేత, ఎంపీ అవధేష్ ప్రసాద్కి అత్యంత సన్నిహితుడు. ఇతని తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాడు.
Read Also: Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో పొత్తుపై చర్చ
Also Read
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
ఈ కేసులో 12 ఏళ్ల బాలిక కుటుంబం ఆమె 12 వారాల గర్భాన్ని తొలగించడానికి సమ్మతించింది. మంగళవారం కేజీఎంయూలోని క్వీన్ మెరీ ఆస్పత్రిలో ఆమెకు అబార్షన్ జరిగింది. అయితే, ఈ కేసులో అసలైన నిందితుడిని గుర్తించేందుకు పిండం యొక్క డీఎన్ఏని పరీక్ష కోసం తీసుకున్నారు. ఇది నేరస్తుల్ని గుర్తించేందుకు ఉపయోగపడనుంది. నిందితుడిపై కేసును బలపరిచేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. బాధితురాలిని సోమవారం అయోధ్య నుంచి లక్నోకి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని సమాచారం. బాలిక సంరక్షణ కోసం ఒక మహిళా సహాయకురాలిని నియమించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (అయోధ్య) చైర్పర్సన్ సర్వేష్ అవస్తీ తెలిపారు. పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం నియమించబడిన వ్యక్తి అమ్మాయికి మద్దతుగా ఉంటారని వెల్లడించారు.
మోయిద్ ఖాన్, అతని ఉద్యోగి రాజుఖాన్ మూడు నెలల క్రితం 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత రెండు నెలలు కూడా బాలికను లైంగికంగా వేధించారు. ఆమెను బెదిరించేందుకు లైంగిక దాడి సమయంలో తీసిన వీడియోలను ఉపయోగించారు. మోయిద్ ఖాన్కి రాజు ఖాన్ సాయం చేశాడు. మైనర్ గర్భవతి అని తేలడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. జూలై 30న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ సీఎం యోగి బాధితురాలి తల్లిని కలుసుకుని ఆమెకు న్యాయం చేస్తానమని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!