Ayodhya Gangrape Case: అయోధ్య గ్యాంగ్ రేప్ కేసులో 12 ఏళ్ల బాలికకు అబార్షన్.. డీఎన్ఏ పరీక్ష..
- యూపీ రాజకీయాల్లో సంచలనంగా అయోధ్య గ్యాంగ్రేప్ కేసు..
- 12 ఏళ్ల బాలికకు అబార్షన్.. డీఎన్ఏ పరీక్ష..
- నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Gangrape Case: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడైన మోయిద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కీలక నేతగా ఉన్నారు. ఇతను భద్రస నగర ఎస్పీ అధ్యక్షుడు. ఇతడితో పాటు ఇతనికి సంబంధించిన ఖాన్ బేకరీలో పనిచేసే రాజు ఖాన్ మరో నిందితుడు. దీంతో ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిందితుడి బేకరీని, ఆస్తుల్ని యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేసింది. నిందితుడు మోయిద్ ఖాన్, ఇటీవల లోక్సభ ఎన్నికల్లో అయోధ్య ఫైజాబాద్ నుంచి గెలిచిన ఎస్పీ నేత, ఎంపీ అవధేష్ ప్రసాద్కి అత్యంత సన్నిహితుడు. ఇతని తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాడు.
Read Also: Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో పొత్తుపై చర్చ
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ఈ కేసులో 12 ఏళ్ల బాలిక కుటుంబం ఆమె 12 వారాల గర్భాన్ని తొలగించడానికి సమ్మతించింది. మంగళవారం కేజీఎంయూలోని క్వీన్ మెరీ ఆస్పత్రిలో ఆమెకు అబార్షన్ జరిగింది. అయితే, ఈ కేసులో అసలైన నిందితుడిని గుర్తించేందుకు పిండం యొక్క డీఎన్ఏని పరీక్ష కోసం తీసుకున్నారు. ఇది నేరస్తుల్ని గుర్తించేందుకు ఉపయోగపడనుంది. నిందితుడిపై కేసును బలపరిచేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. బాధితురాలిని సోమవారం అయోధ్య నుంచి లక్నోకి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని సమాచారం. బాలిక సంరక్షణ కోసం ఒక మహిళా సహాయకురాలిని నియమించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (అయోధ్య) చైర్పర్సన్ సర్వేష్ అవస్తీ తెలిపారు. పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం నియమించబడిన వ్యక్తి అమ్మాయికి మద్దతుగా ఉంటారని వెల్లడించారు.
మోయిద్ ఖాన్, అతని ఉద్యోగి రాజుఖాన్ మూడు నెలల క్రితం 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత రెండు నెలలు కూడా బాలికను లైంగికంగా వేధించారు. ఆమెను బెదిరించేందుకు లైంగిక దాడి సమయంలో తీసిన వీడియోలను ఉపయోగించారు. మోయిద్ ఖాన్కి రాజు ఖాన్ సాయం చేశాడు. మైనర్ గర్భవతి అని తేలడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. జూలై 30న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ సీఎం యోగి బాధితురాలి తల్లిని కలుసుకుని ఆమెకు న్యాయం చేస్తానమని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!