Andhra tourist: గోవాలో ఏపీ టూరిస్టుని చంపిన బీచ్ షాక్ సిబ్బంది..
- గోవాలో ఏపీ టూరిస్ట్ హత్య..
- ఫుడ్ విషయంలో షాక్ సిబ్బందితో గొడవ..
- కర్రలతో దాడి చేయడంతో మృతి..
Andhra tourist: గోవాకు టూరిస్టులు తగ్గిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది గోవాకు వెళ్లే టూరిస్టుల సంఖ్య తగ్గింది. అక్కడికి వెళ్లి మోసపోతున్నామని చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లడానికి మోగ్గు చూపుతున్నారు. ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి టాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి హోటల్ రూంల వరకు అన్నింట స్కామ్లకు గురవుతున్నామనే అభిప్రాయం టూరిస్టుల్లో నెలకొంది. దీనికి తోడు అక్కడి స్థానికుల ప్రవర్తన కూడా టూరిస్టుల పట్ల సరిగా ఉండటం లేదనే అభియోగం ఉంది.
ఇదిలా ఉంటే, గోవాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్కి చెందిన టూరిస్ట్ హత్యకు గురువ్వడం సంచలనంగా మారింది. బీష్ షాక్ సిబ్బంది, సమయం దాటిందని ఫుడ్ ఆర్డర్ తీసుకోమని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు ఫుడ్ ఆర్డర్ వివాదంలో టూరిస్ట్ గ్రూప్కి బీష్ షాక్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన 28 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
Also Read
Read Also: Hamas Attack On Israel: ఇజ్రాయిల్పై దాడికి 7 ఏళ్ల నుంచే నిఘా పెట్టిన హమాస్..
మృతుడిని భోలా రవితేజగా గుర్తించామరి, నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. షాక్ యాజమాని అగ్నెల్ సిల్వేరా(64), అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియా(23), ఇద్దరు సిబ్బంది అనిల్ బిస్టా(24), సమల్ సునర్(23)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘తెల్లవారుజామున 1 గంటలకు కలంగుట్ బీచ్లోని మెరీనా షాక్ వద్ద ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంపై వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు తేజపై చెక్క కర్రలతో దాడి చేశారు. తలకు బలమైన గాయం కావడంతో తేజ మరణించాడు.’’ అని నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.
ఆర్డర్ తీసుకునే టైం దాటిందని, ఇక ఫుడ్ ఆర్డర్ తీసుకోమని షాక్ సిబ్బంది చెప్పడంతో వివాదం మొదలైంది. ఇంతకుముందు ఆర్డర్ చేసిన ఫుడ్కి బిల్లు చెల్లించమని టూరిస్ట్ గ్రూప్ చెప్పడంతో హింసాత్మక దాడికి కారణమైంది. గోవాలో గత కొన్ని రోజుల్లో ఇది మూడో మరణం. అంతకుముందు 26 ఏళ్ల ఢిల్లీ నివాసి నవంబర్లో సన్బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహారాష్ట్రకు చెందిన పర్యాటకుడు బోట్ బోల్తా పడి మరణించాడు.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!