Andhra tourist: గోవాలో ఏపీ టూరిస్టుని చంపిన బీచ్ షాక్ సిబ్బంది..
- గోవాలో ఏపీ టూరిస్ట్ హత్య..
- ఫుడ్ విషయంలో షాక్ సిబ్బందితో గొడవ..
- కర్రలతో దాడి చేయడంతో మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra tourist: గోవాకు టూరిస్టులు తగ్గిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది గోవాకు వెళ్లే టూరిస్టుల సంఖ్య తగ్గింది. అక్కడికి వెళ్లి మోసపోతున్నామని చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లడానికి మోగ్గు చూపుతున్నారు. ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి టాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి హోటల్ రూంల వరకు అన్నింట స్కామ్లకు గురవుతున్నామనే అభిప్రాయం టూరిస్టుల్లో నెలకొంది. దీనికి తోడు అక్కడి స్థానికుల ప్రవర్తన కూడా టూరిస్టుల పట్ల సరిగా ఉండటం లేదనే అభియోగం ఉంది.
ఇదిలా ఉంటే, గోవాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్కి చెందిన టూరిస్ట్ హత్యకు గురువ్వడం సంచలనంగా మారింది. బీష్ షాక్ సిబ్బంది, సమయం దాటిందని ఫుడ్ ఆర్డర్ తీసుకోమని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు ఫుడ్ ఆర్డర్ వివాదంలో టూరిస్ట్ గ్రూప్కి బీష్ షాక్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన 28 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
Read Also: Hamas Attack On Israel: ఇజ్రాయిల్పై దాడికి 7 ఏళ్ల నుంచే నిఘా పెట్టిన హమాస్..
మృతుడిని భోలా రవితేజగా గుర్తించామరి, నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. షాక్ యాజమాని అగ్నెల్ సిల్వేరా(64), అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియా(23), ఇద్దరు సిబ్బంది అనిల్ బిస్టా(24), సమల్ సునర్(23)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘తెల్లవారుజామున 1 గంటలకు కలంగుట్ బీచ్లోని మెరీనా షాక్ వద్ద ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంపై వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు తేజపై చెక్క కర్రలతో దాడి చేశారు. తలకు బలమైన గాయం కావడంతో తేజ మరణించాడు.’’ అని నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు.
ఆర్డర్ తీసుకునే టైం దాటిందని, ఇక ఫుడ్ ఆర్డర్ తీసుకోమని షాక్ సిబ్బంది చెప్పడంతో వివాదం మొదలైంది. ఇంతకుముందు ఆర్డర్ చేసిన ఫుడ్కి బిల్లు చెల్లించమని టూరిస్ట్ గ్రూప్ చెప్పడంతో హింసాత్మక దాడికి కారణమైంది. గోవాలో గత కొన్ని రోజుల్లో ఇది మూడో మరణం. అంతకుముందు 26 ఏళ్ల ఢిల్లీ నివాసి నవంబర్లో సన్బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహారాష్ట్రకు చెందిన పర్యాటకుడు బోట్ బోల్తా పడి మరణించాడు.
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!