Madhya Pradesh : ఆ ఇంజనీర్కు 5 మంది భార్యలు.. ఏడాదికో పెళ్లి?
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఐదుగురు భార్యలు
- ఎస్పీకి కంప్లేంట్ ఇచ్చిన మొదటి భార్య
- న్యాయం చేయాలని వేడుకున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఒకరిద్దరు కాదు ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇంజనీర్ మొదటి భార్య అని చెప్పుకుంటున్న ఓ మహిళ ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఇన్చార్జి ఎస్పీని వేడుకున్న మహిళ.. తన భర్త పని సాకుతో చాలా రోజులుగా ఇంటి నుంచి బయటే ఉంటున్నాడని తెలిపారు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. అంతే కాదు నిందితుడైన భర్త ఇప్పుడు విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు.
READ MORE: FLASH BACK Movie: యూత్ ఫుల్ ఎంటర్టైనర్తో వస్తోన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఆ మహిళకు 2018 మే 13న వివాహం..
ఫిర్యాదుతో గ్వాలియర్లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఓ మహిళ తనకు మురార్ టికోనియా నివాసి రుస్తమ్ సింగ్తో మే 13, 2018న వివాహం జరిగినట్లు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త రుస్తమ్ సింగ్ ఓ విదేశీ కంపెనీలో సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లయినప్పటి నుంచి ఉద్యోగం పేరు చెప్పి.. చాలా రోజులుగా ఇంటికి రావడం లేదు. ఆమెకు అనుమానం రావడంతో విచారించడం మొదలు పెట్టింది. తన భర్త తనతో పాటు మరో నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. అంతే కాదు భర్త కుటుంబానికి కూడా ఇదంతా తెలుసు. వారే దగ్గరుండి జరిపిస్తున్నారు. ఏడాదికో పెళ్లి చొప్పున ఇప్పటికే 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు.
READ MORE:Thota Trimurthulu: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా..?
ఇలా భార్యలందరినీ మోసం..
తమ కుమారుడికి పని సాకు చెబుతూ.. భర్త కుటుంబ సభ్యులే వేర్వేరు చోట్ల పెళ్లి చేశారని మహిళ ఆరోపిస్తున్నారు. నిందితుడు భర్త రుస్తమ్ సింగ్ పని సాకు చూపుతూ.. ప్రతి భార్యను ఇలాగే మోసం చేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఎస్పీ రాకేష్కుమార్ను ఆశ్రయించారు. 2022లో తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టానని, అది కోర్టులో పెండింగ్లో ఉందని బాధితురాలు తెలిపారు. భర్త విదేశీ కంపెనీలో పనిచేస్తున్నాడని.. అందుకే ఇప్పుడు విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహిళా క్రైం డీఎస్పీ కిరణ్ అహిర్వార్ బాధితురాలికి హామీ ఇచ్చారు.]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!