Madhya Pradesh : ఆ ఇంజనీర్కు 5 మంది భార్యలు.. ఏడాదికో పెళ్లి?
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఐదుగురు భార్యలు
- ఎస్పీకి కంప్లేంట్ ఇచ్చిన మొదటి భార్య
- న్యాయం చేయాలని వేడుకున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఒకరిద్దరు కాదు ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇంజనీర్ మొదటి భార్య అని చెప్పుకుంటున్న ఓ మహిళ ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఇన్చార్జి ఎస్పీని వేడుకున్న మహిళ.. తన భర్త పని సాకుతో చాలా రోజులుగా ఇంటి నుంచి బయటే ఉంటున్నాడని తెలిపారు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. అంతే కాదు నిందితుడైన భర్త ఇప్పుడు విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు.
READ MORE: FLASH BACK Movie: యూత్ ఫుల్ ఎంటర్టైనర్తో వస్తోన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ఆ మహిళకు 2018 మే 13న వివాహం..
ఫిర్యాదుతో గ్వాలియర్లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఓ మహిళ తనకు మురార్ టికోనియా నివాసి రుస్తమ్ సింగ్తో మే 13, 2018న వివాహం జరిగినట్లు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త రుస్తమ్ సింగ్ ఓ విదేశీ కంపెనీలో సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లయినప్పటి నుంచి ఉద్యోగం పేరు చెప్పి.. చాలా రోజులుగా ఇంటికి రావడం లేదు. ఆమెకు అనుమానం రావడంతో విచారించడం మొదలు పెట్టింది. తన భర్త తనతో పాటు మరో నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. అంతే కాదు భర్త కుటుంబానికి కూడా ఇదంతా తెలుసు. వారే దగ్గరుండి జరిపిస్తున్నారు. ఏడాదికో పెళ్లి చొప్పున ఇప్పటికే 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు.
READ MORE:Thota Trimurthulu: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా..?
ఇలా భార్యలందరినీ మోసం..
తమ కుమారుడికి పని సాకు చెబుతూ.. భర్త కుటుంబ సభ్యులే వేర్వేరు చోట్ల పెళ్లి చేశారని మహిళ ఆరోపిస్తున్నారు. నిందితుడు భర్త రుస్తమ్ సింగ్ పని సాకు చూపుతూ.. ప్రతి భార్యను ఇలాగే మోసం చేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఎస్పీ రాకేష్కుమార్ను ఆశ్రయించారు. 2022లో తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టానని, అది కోర్టులో పెండింగ్లో ఉందని బాధితురాలు తెలిపారు. భర్త విదేశీ కంపెనీలో పనిచేస్తున్నాడని.. అందుకే ఇప్పుడు విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహిళా క్రైం డీఎస్పీ కిరణ్ అహిర్వార్ బాధితురాలికి హామీ ఇచ్చారు.]
తాజావార్తలు
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
-
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
-
France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
-
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!