NTV Telugu Site icon

Crime: అత్తాపూర్ లో శవమైన కనిపించిన ఓ వ్యక్తి.. చంపేశారంటూ పీఎస్ ముందు ధర్నా

Athapur

Athapur

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. గత 17 రోజుల క్రితం అత్తాపూర్ గోల్డన్ ప్యాలెస్ హోటల్ దగ్గర శవమై తేలిన గులామ్ హుస్సేన్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని వారు ఆరోపించారు. విచక్షణారహితంగా కొట్టి చంపి శవాన్ని గోల్డన్ ప్యాలెస్ హోటల్ వెనుక పడేసారంటూ హుస్సేన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.. పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Read Also: Bhagavanth kesari: ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్

ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ పోలీసులను నిలదీస్తూ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులు బైటాయించారు. అత్తాపూర్ కల్లు కంపౌడ్ యాజమాన్యంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వాళ్లే గులామ్ హుస్సేన్ ను చంపి శవాన్ని గోల్డెన్ ప్యాలెస్ హోటల్ సమీపంలో పడేసారంటూ ఆరోపించారు. సీసీ టీవి కెమారాలో ఈ దృశ్యాలు రికార్డు అయినట్లు వారు పేర్కొన్నారు.

Read Also: Hyper Aadhi: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసిన ఆది..?

గులామ్ హుస్సేన్ హత్యపై పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. కనీసం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేయలేదు అని వాపోయారు. తమకు న్యాయం కావాలి అని డిమాండ్ చేశారు. గులాం హుస్సేన్ ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి అని మృతుడి బంధువులు కోరారు. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరపాలి.. మొత్తం ఈ కేసులో నాలుగురి ప్రమేయం ఉంది అని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.