Cyber Crime: ఒక టీ-షర్ట్ కొన్న పాపానికి రూ. 3 లక్షలు హాంఫట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు ఎప్పుడెప్పుడు జనాల్ని బుట్టలో పడేద్దామా? టోకరా వేద్దామా? అంటూ నిత్యం కాచుకొని ఉంటారు. ఇందుకోసం వాళ్లు చేయని ప్రయత్నాలు, రచించని వ్యూహాలంటూ ఉండవు. లక్షల్లో, కోట్లలో ప్రైజ్మనీ గెలుచుకున్నారంటూ.. తమ ట్రాప్లో పడేసేందుకు ట్రై చేస్తారు. ఇలా ఎంతోమంది టెంప్ట్ అయ్యి, లక్షలు పోగొట్టుకున్నారు. తాజాగా ఓ యువ వ్యాపారి కూడా అలాగే మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి, లక్షల రూపాయల్ని బుగ్గిపాలు చేసుకున్నాడు. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఓ యువకుడు.. ఈనెల 9వ తేదీన ఆన్లైన్లో రూ. 432తో టీ-షర్ట్స్ కొనుగోలు చేశాడు. ఈ ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు.. 13వ తేదీన అతనికి ఫోన్ చేశారు. తొలుత ప్రశాంతి అనే యువతి ఫోన్ చేసింది. ‘‘కంగ్రాచులేషన్స్, టీ-షర్ట్స్ కొన్న మీరు లక్కీ విజేతగా రూ. 6.20 లక్షలు గెలుచుకున్నారు. కేవలం కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే, ఆ సొమ్ము మీకు అందుతుంది’’ అంటూ మాయమాటలు ఆ యువతి చెప్పింది. తాను కొనుగోలు చేసిన టీ-షర్ట్స్ ప్రస్తావన తీసుకురావడంతో, నిజంగానే లక్కీ డ్రా గెలిచానేమోనని నమ్మేశాడు.
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఆ వెంటనే అతనికి అలోక్కుమార్ సింగ్, సంజయ్శర్మ పేర్లతో మరో రెండు ఫోన్లు వచ్చాయి. పక్కా ప్రొఫెషనల్స్గా మాట్లాడడంతో, వారి మాటల్ని నమ్మేశాడు. తమ బుట్టలో పడ్డాడని తెలుసుకున్న ఆ నేరగాళ్లు.. ఎన్వోసీ, టీడీఎస్, ఆదాయ పన్ను, కన్వర్జేషన్ చార్జీల పేరిట తమ ఖాతాలో డబ్బు జమ చేసుకున్నారు. అంతేకాదు.. ‘మీరు అదనంగా రూ. 10.41 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారని నమ్మించి.. ఆ డబ్బు పొందాలంటే రూ. 1,09,000 కట్టాలని అడిగారు. అలా అతడ్ని నమ్మించి ఏకంగా రూ. 3,21,200 కొట్టేశారు.
తమ ఖాతాలో డబ్బు మొత్తం జమ అయిన తర్వాత.. త్వరలోనే మీకు ఫోన్ చేస్తామని చెప్పి వాళ్లు పెట్టేశారు. కానీ, అతనికి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. తిరిగి వాళ్ల నంబర్స్కి కాల్ చేస్తే.. అవి స్విచ్చాఫ్లో ఉన్నాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు.. సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!