UP: ఇన్స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!
- ఇన్స్టాలో వివాహితతో ప్రేమ
- పెళ్లి చేసుకోమనడంతో హోటల్కు పిలిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సాంప్రదాయంలో వైవాహిక జీవితం చాలా ప్రత్యేకమైంది. భార్యాభర్తల బంధాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి బంధాన్ని కొందరు క్షణిక సుఖం కోసం పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాళ్లనే కడతేర్చేస్తున్నారు. ఇక కొందరైతే కామంతో కళ్లు మూసుకుపోయి.. వయసు పైబడిన వారు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. లేటు వయసులో ఒక మహిళ ప్రేమలో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: మధ్యాహ్నం కవిత ప్రెస్మీట్.. బీఆర్ఎస్ నేతలే టార్గెటా?, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పేనా?
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో ఫరూఖాబాద్కు చెందిన రాణి అనే మహిళ (52).. ఇన్స్టాగ్రామ్లో 26 ఏళ్ల అరుణ్ రాజ్పుత్తో ప్రేమలో పడింది. వయసును దాచిపెట్టి అతడితో లవ్లో పడింది. తొలుత ఆన్లైన్లో సంభాషణలు కొనసాగించారు. అనంతరం ఫరూఖాబాద్లో హోటళ్లలో కలుస్తుండేవారు. నలుగురు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టి రాజ్పుత్తో సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే రాజ్పుత్కు రూ.1.5 లక్షలు సాయం చేసింది.
ఇది కూడా చదవండి: Kadapa: వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!
ఇక ఇద్దరి మధ్య బంధం బలపడుతుండగా పెళ్లి చేసుకోవాలంటూ రాజ్పుత్పై రాణి ఒత్తిడి తెస్తోంది. అంతేకాకుండా తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇచ్చేయాలని కోరుతోంది. దీంతో ప్రియుడు ఒత్తిడికి గురయ్యాడు. ఆమెను అడ్డుతొలగించుకోవాలని ప్రణాళిక రచించాడు. ఆగస్టు 10న రాణిని మైన్పురికి పిలిచాడు. మళ్లీ అదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది. పెళ్లి చేసుకోవాలని కోరింది. అంతేకాకుండా డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచింది. దీంతో కోపోద్రేకుడైన రాజ్పుత్.. రాణి గొంతు కోసి పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టారిఫ్లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్హౌస్లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!
ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మహిళ ఎవరనేది గుర్తించేందుకు పోస్టర్లను అతికించారు. అనంతరం ఫరూఖాబాద్లో తప్పిపోయిన ఫిర్యాదుతో పోల్చగా.. రాణి అని తేలింది. ఇక రాణి మొబైల్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా బుధవారం అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. ఫొటోలు, చాట్లు ఉన్నాయని చెప్పారు.
ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య ఇన్స్టాలో పరిచయం ఏర్పడిందని.. అనంతరం హోటళ్లలో కలుస్తుండడంతో ఇద్దరి మధ్య బంధం ఏర్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రియుడికి సాయం చేసిందని.. అలాగే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు చంపేసినట్లుగా వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!