UP: ఇన్స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!
- ఇన్స్టాలో వివాహితతో ప్రేమ
- పెళ్లి చేసుకోమనడంతో హోటల్కు పిలిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సాంప్రదాయంలో వైవాహిక జీవితం చాలా ప్రత్యేకమైంది. భార్యాభర్తల బంధాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి బంధాన్ని కొందరు క్షణిక సుఖం కోసం పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాళ్లనే కడతేర్చేస్తున్నారు. ఇక కొందరైతే కామంతో కళ్లు మూసుకుపోయి.. వయసు పైబడిన వారు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. లేటు వయసులో ఒక మహిళ ప్రేమలో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: మధ్యాహ్నం కవిత ప్రెస్మీట్.. బీఆర్ఎస్ నేతలే టార్గెటా?, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పేనా?
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో ఫరూఖాబాద్కు చెందిన రాణి అనే మహిళ (52).. ఇన్స్టాగ్రామ్లో 26 ఏళ్ల అరుణ్ రాజ్పుత్తో ప్రేమలో పడింది. వయసును దాచిపెట్టి అతడితో లవ్లో పడింది. తొలుత ఆన్లైన్లో సంభాషణలు కొనసాగించారు. అనంతరం ఫరూఖాబాద్లో హోటళ్లలో కలుస్తుండేవారు. నలుగురు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టి రాజ్పుత్తో సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే రాజ్పుత్కు రూ.1.5 లక్షలు సాయం చేసింది.
ఇది కూడా చదవండి: Kadapa: వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!
ఇక ఇద్దరి మధ్య బంధం బలపడుతుండగా పెళ్లి చేసుకోవాలంటూ రాజ్పుత్పై రాణి ఒత్తిడి తెస్తోంది. అంతేకాకుండా తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇచ్చేయాలని కోరుతోంది. దీంతో ప్రియుడు ఒత్తిడికి గురయ్యాడు. ఆమెను అడ్డుతొలగించుకోవాలని ప్రణాళిక రచించాడు. ఆగస్టు 10న రాణిని మైన్పురికి పిలిచాడు. మళ్లీ అదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది. పెళ్లి చేసుకోవాలని కోరింది. అంతేకాకుండా డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచింది. దీంతో కోపోద్రేకుడైన రాజ్పుత్.. రాణి గొంతు కోసి పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టారిఫ్లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్హౌస్లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!
ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మహిళ ఎవరనేది గుర్తించేందుకు పోస్టర్లను అతికించారు. అనంతరం ఫరూఖాబాద్లో తప్పిపోయిన ఫిర్యాదుతో పోల్చగా.. రాణి అని తేలింది. ఇక రాణి మొబైల్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా బుధవారం అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. ఫొటోలు, చాట్లు ఉన్నాయని చెప్పారు.
ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య ఇన్స్టాలో పరిచయం ఏర్పడిందని.. అనంతరం హోటళ్లలో కలుస్తుండడంతో ఇద్దరి మధ్య బంధం ఏర్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రియుడికి సాయం చేసిందని.. అలాగే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు చంపేసినట్లుగా వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!