NTV Telugu Site icon

UP Crime: స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..

Gang Rape

Gang Rape

UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నిందితులకు భయం అనేదే లేకుండా పోయింది. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

Read Also: Israel-Hezbollah War: 500కి చేరిన లెబనాన్ మృతుల సంఖ్య.. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచన

స్కూల్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు బంధించి అత్యాచారానికి ఒడిగట్టారు. పాఠశాల నుంచి వచ్చే దారిలో నిందితులు ఆమెని కిడ్నాప్ చేసి హోటల్‌కి తీసుకెళ్లారు. ఆపై ఇద్దరూ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిందితులు డానిష్, అమీన్‌లు పాఠశాలకు వెళ్లే మార్గంలో కారులో బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత లక్నోలోని కృష్ణా నగర్ ప్రాంతంలోని ఓ హోటల్‌కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితులు బాలిక అసభ్యకరమైన వీడియోలను, అశ్లీల చిత్రాలను రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. నిందితులు ఆమెను కారులో తీసుకువచ్చి ఇంటి ముందు తోసేశారు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి చెప్పగా, సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు లక్నో సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేశవ్ కుమార్ తెలిపారు. హోటల్‌లో సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ సాగిస్తున్నట్లు చెప్పారు.