Anil Agarwal Warns: భారత్ను ప్రపంచం మార్కెట్గా చేస్తోంది.. అభివృద్ధిని కోరుకోవడం లేదు… అనిల్ అగర్వాల్ సంచలన పోస్ట్..
- ప్రపంచ దేశాలు భారత్ను ఉత్పత్తి కేంద్రంగా చూడడం లేదు..
- భారత్ను కేవలం మార్కెట్గా మాత్రమే చూస్తున్నాయి..
- భారతదేశం పురోగతిని ప్రపంచం కోరుకోవడం లేదు..
- వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సంచలన పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Agarwal Warns: వేదాంత గ్రూప్ చైర్మన్, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలు భారత్ను ఉత్పత్తి కేంద్రంగా కాకుండా కేవలం మార్కెట్గా మాత్రమే చూస్తున్నాయని, భారతదేశం పురోగతిని ప్రపంచం కోరుకోవడం లేదని ఆయన తన తాజా పోస్టులో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనిల్ అగర్వాల్, ఇటీవల వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ ప్రజా చర్చల్లోకి వచ్చారు. X (ట్విట్టర్)లో చేసిన పోస్టులో, భారత్ స్వావలంబన దిశగా మరింత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
దేశీయ ఉత్పత్తి, ఉపాధిపై దృష్టి అవసరం
ప్రపంచం భారత్ను వినియోగ మార్కెట్గా మాత్రమే చూడాలనుకుంటోందని, ఉత్పత్తి దేశంగా ఎదగడం కొందరికి ఇష్టంలేదని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనను భారత్ తిరస్కరించాల్సిన అవసరం ఉందని, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించాలని సూచించారు. ఒకప్పుడు ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్, నేడు స్వయం సమృద్ధి సాధించిందని, ప్రభుత్వ విధానాలు మరియు ఉద్యమాల వల్లే ఇది సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు.
Also Read
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
- Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
- Income Tax: భారత్లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరం
భారతదేశ ఇంధన భద్రతపై కూడా అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశానికి అవసరమైన చమురు, గ్యాస్లో సుమారు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నామని, ఇది భారత్ను దుర్బలంగా మారుస్తోందని అన్నారు. మూడు వైపులా సముద్రం ఉన్న దేశంగా, ఏదైనా అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఏర్పడితే ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే 20 సంవత్సరాల్లో భారత్లో చమురు, గ్యాస్ డిమాండ్ మరింత పెరగనుందని, ఈ పరిస్థితిలో దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
‘ఏం చేయాలి?’
భారతదేశంలో అపారమైన సహజ వనరులు, ప్రతిభావంతులైన వ్యవస్థాపకులు ఉన్నారని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇంధన రంగంలో కీలకమైన అంశం అన్వేషణ (Exploration) అని ఆయన నొక్కిచెప్పారు. 20 ఏళ్ల క్రితం అమెరికా కూడా హైడ్రోకార్బన్ దిగుమతులపై ఆధారపడిందని, కానీ అన్వేషణను ప్రైవేటు రంగానికి తెరవడం ద్వారా ఆ దేశం తన ఇంధన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుందని ఉదాహరణగా తెలిపారు. ప్రస్తుతం భారత్లో ఇంధన రంగానికి సంబంధించి కేవలం కొన్ని లైసెన్సులే ఉన్నాయని, అవసరమైతే వేల సంఖ్యలో లైసెన్సులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కఠినమైన నిబంధనలను సడలించి, ఉత్పత్తిని సులభతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
బీహార్ నుంచి లండన్ వరకు వ్యాపార ప్రయాణం
అనిల్ అగర్వాల్ భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. బీహార్లో చిన్న స్థాయి వ్యాపారంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం ముంబై మీదుగా లండన్ వరకు విస్తరించింది. మైనింగ్, లోహాలు, సెమీ కండక్టర్ల రంగాల్లో వేదాంత గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అనిల్ అగర్వాల్ నికర విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ. 36 వేల కోట్లకు పైగా)గా అంచనా వేయబడింది.
In today’s turbulent geopolitics, it is critically important for every large nation to secure energy independence. India is vulnerable because we import 90% of our oil and gas. We are surrounded by sea on three sides which can be blockaded in hostile times. There is no option but…
— Anil Agarwal (@AnilAgarwal_Ved) February 9, 2026
తాజావార్తలు
-
Adarsha Kutumbam: గురూజీ మారిపోయాడా?
-
Sheikh Hasina: నన్ను చంపినా.. అరెస్ట్ చేసినా బంగ్లాదేశ్కు వెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!