Anil Agarwal Warns: భారత్ను ప్రపంచం మార్కెట్గా చేస్తోంది.. అభివృద్ధిని కోరుకోవడం లేదు… అనిల్ అగర్వాల్ సంచలన పోస్ట్..
- ప్రపంచ దేశాలు భారత్ను ఉత్పత్తి కేంద్రంగా చూడడం లేదు..
- భారత్ను కేవలం మార్కెట్గా మాత్రమే చూస్తున్నాయి..
- భారతదేశం పురోగతిని ప్రపంచం కోరుకోవడం లేదు..
- వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సంచలన పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Agarwal Warns: వేదాంత గ్రూప్ చైర్మన్, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలు భారత్ను ఉత్పత్తి కేంద్రంగా కాకుండా కేవలం మార్కెట్గా మాత్రమే చూస్తున్నాయని, భారతదేశం పురోగతిని ప్రపంచం కోరుకోవడం లేదని ఆయన తన తాజా పోస్టులో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనిల్ అగర్వాల్, ఇటీవల వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ ప్రజా చర్చల్లోకి వచ్చారు. X (ట్విట్టర్)లో చేసిన పోస్టులో, భారత్ స్వావలంబన దిశగా మరింత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
దేశీయ ఉత్పత్తి, ఉపాధిపై దృష్టి అవసరం
ప్రపంచం భారత్ను వినియోగ మార్కెట్గా మాత్రమే చూడాలనుకుంటోందని, ఉత్పత్తి దేశంగా ఎదగడం కొందరికి ఇష్టంలేదని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనను భారత్ తిరస్కరించాల్సిన అవసరం ఉందని, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించాలని సూచించారు. ఒకప్పుడు ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్, నేడు స్వయం సమృద్ధి సాధించిందని, ప్రభుత్వ విధానాలు మరియు ఉద్యమాల వల్లే ఇది సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు.
Also Read
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
- Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
- Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
- Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరం
భారతదేశ ఇంధన భద్రతపై కూడా అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశానికి అవసరమైన చమురు, గ్యాస్లో సుమారు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నామని, ఇది భారత్ను దుర్బలంగా మారుస్తోందని అన్నారు. మూడు వైపులా సముద్రం ఉన్న దేశంగా, ఏదైనా అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఏర్పడితే ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే 20 సంవత్సరాల్లో భారత్లో చమురు, గ్యాస్ డిమాండ్ మరింత పెరగనుందని, ఈ పరిస్థితిలో దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
‘ఏం చేయాలి?’
భారతదేశంలో అపారమైన సహజ వనరులు, ప్రతిభావంతులైన వ్యవస్థాపకులు ఉన్నారని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇంధన రంగంలో కీలకమైన అంశం అన్వేషణ (Exploration) అని ఆయన నొక్కిచెప్పారు. 20 ఏళ్ల క్రితం అమెరికా కూడా హైడ్రోకార్బన్ దిగుమతులపై ఆధారపడిందని, కానీ అన్వేషణను ప్రైవేటు రంగానికి తెరవడం ద్వారా ఆ దేశం తన ఇంధన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుందని ఉదాహరణగా తెలిపారు. ప్రస్తుతం భారత్లో ఇంధన రంగానికి సంబంధించి కేవలం కొన్ని లైసెన్సులే ఉన్నాయని, అవసరమైతే వేల సంఖ్యలో లైసెన్సులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కఠినమైన నిబంధనలను సడలించి, ఉత్పత్తిని సులభతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
బీహార్ నుంచి లండన్ వరకు వ్యాపార ప్రయాణం
అనిల్ అగర్వాల్ భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. బీహార్లో చిన్న స్థాయి వ్యాపారంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం ముంబై మీదుగా లండన్ వరకు విస్తరించింది. మైనింగ్, లోహాలు, సెమీ కండక్టర్ల రంగాల్లో వేదాంత గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అనిల్ అగర్వాల్ నికర విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ. 36 వేల కోట్లకు పైగా)గా అంచనా వేయబడింది.
In today’s turbulent geopolitics, it is critically important for every large nation to secure energy independence. India is vulnerable because we import 90% of our oil and gas. We are surrounded by sea on three sides which can be blockaded in hostile times. There is no option but…
— Anil Agarwal (@AnilAgarwal_Ved) February 9, 2026
తాజావార్తలు
-
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!