Anil Agarwal Warns: భారత్ను ప్రపంచం మార్కెట్గా చేస్తోంది.. అభివృద్ధిని కోరుకోవడం లేదు… అనిల్ అగర్వాల్ సంచలన పోస్ట్..
- ప్రపంచ దేశాలు భారత్ను ఉత్పత్తి కేంద్రంగా చూడడం లేదు..
- భారత్ను కేవలం మార్కెట్గా మాత్రమే చూస్తున్నాయి..
- భారతదేశం పురోగతిని ప్రపంచం కోరుకోవడం లేదు..
- వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సంచలన పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Agarwal Warns: వేదాంత గ్రూప్ చైర్మన్, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలు భారత్ను ఉత్పత్తి కేంద్రంగా కాకుండా కేవలం మార్కెట్గా మాత్రమే చూస్తున్నాయని, భారతదేశం పురోగతిని ప్రపంచం కోరుకోవడం లేదని ఆయన తన తాజా పోస్టులో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనిల్ అగర్వాల్, ఇటీవల వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ ప్రజా చర్చల్లోకి వచ్చారు. X (ట్విట్టర్)లో చేసిన పోస్టులో, భారత్ స్వావలంబన దిశగా మరింత వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
దేశీయ ఉత్పత్తి, ఉపాధిపై దృష్టి అవసరం
ప్రపంచం భారత్ను వినియోగ మార్కెట్గా మాత్రమే చూడాలనుకుంటోందని, ఉత్పత్తి దేశంగా ఎదగడం కొందరికి ఇష్టంలేదని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనను భారత్ తిరస్కరించాల్సిన అవసరం ఉందని, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించాలని సూచించారు. ఒకప్పుడు ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్, నేడు స్వయం సమృద్ధి సాధించిందని, ప్రభుత్వ విధానాలు మరియు ఉద్యమాల వల్లే ఇది సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు.
Also Read
- Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరం
భారతదేశ ఇంధన భద్రతపై కూడా అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశానికి అవసరమైన చమురు, గ్యాస్లో సుమారు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నామని, ఇది భారత్ను దుర్బలంగా మారుస్తోందని అన్నారు. మూడు వైపులా సముద్రం ఉన్న దేశంగా, ఏదైనా అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఏర్పడితే ఇంధన సరఫరా తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే 20 సంవత్సరాల్లో భారత్లో చమురు, గ్యాస్ డిమాండ్ మరింత పెరగనుందని, ఈ పరిస్థితిలో దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
‘ఏం చేయాలి?’
భారతదేశంలో అపారమైన సహజ వనరులు, ప్రతిభావంతులైన వ్యవస్థాపకులు ఉన్నారని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇంధన రంగంలో కీలకమైన అంశం అన్వేషణ (Exploration) అని ఆయన నొక్కిచెప్పారు. 20 ఏళ్ల క్రితం అమెరికా కూడా హైడ్రోకార్బన్ దిగుమతులపై ఆధారపడిందని, కానీ అన్వేషణను ప్రైవేటు రంగానికి తెరవడం ద్వారా ఆ దేశం తన ఇంధన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుందని ఉదాహరణగా తెలిపారు. ప్రస్తుతం భారత్లో ఇంధన రంగానికి సంబంధించి కేవలం కొన్ని లైసెన్సులే ఉన్నాయని, అవసరమైతే వేల సంఖ్యలో లైసెన్సులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కఠినమైన నిబంధనలను సడలించి, ఉత్పత్తిని సులభతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
బీహార్ నుంచి లండన్ వరకు వ్యాపార ప్రయాణం
అనిల్ అగర్వాల్ భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. బీహార్లో చిన్న స్థాయి వ్యాపారంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం ముంబై మీదుగా లండన్ వరకు విస్తరించింది. మైనింగ్, లోహాలు, సెమీ కండక్టర్ల రంగాల్లో వేదాంత గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అనిల్ అగర్వాల్ నికర విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ. 36 వేల కోట్లకు పైగా)గా అంచనా వేయబడింది.
In today’s turbulent geopolitics, it is critically important for every large nation to secure energy independence. India is vulnerable because we import 90% of our oil and gas. We are surrounded by sea on three sides which can be blockaded in hostile times. There is no option but…
— Anil Agarwal (@AnilAgarwal_Ved) February 9, 2026
తాజావార్తలు
-
Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
-
Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
-
Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
-
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!