WPI Inflation: 30 ఏళ్ల గరిష్టానికి టోకు ధరల సూచీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం) పెరుగుతూ పోతోంది.. ఈ ఏడాది ఏప్రిల్లో 15.08 శాతంగా నమోదు కాగా.. ఇక, మే నెలలో 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుని 15.88 శాతంగా నమోదైంది.. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు.. కాగా, ఏప్రిల్లోనే 30 ఏళ్ల గరిష్టాన్ని తాకింది టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. ఇప్పుడు అది కొనసాగిస్తూ.. మరింత పైకి కదలడం ఆందోళన కలిగించే విషయం.. మేలో, భారతదేశంలో పట్టణ ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉండగా.. గ్రామీణ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది.. ఇది కేరళలో అత్యల్పంగా 4.8 శాతంగా ఉంటే.. తెలంగాణలో అత్యధికంగా 9.5 శాతానికి చేరింది.. ఇక, రూపాయితో డాలర్ మారకం విలువ బలపడే విధంగా ఆర్బీఐ ప్రయత్నాలు చేయకపోవడం కారణంగా రూపాయి విలువ 82కి పడిపోవచ్చుననే అంచనాలు నెలకొన్నాయి.. ఈ ఏడాది జనవరి 1న డాలర్తో 74.51గా ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది 5.9 శాతం క్షీణించి 78.95కి చేరుకుంది. పెరుగుతున్న డాలర్ ఇండెక్స్, వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం రూపాయి క్షీణతకు ప్రధాన కారణం అనే ఆందోళనలు నెలకొన్నాయి.. ఇది ఇలాగే కొనసాగితే రూపాయి విలువ 82కు చేరుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
Read Also: Pawan Kalyan: తాడిమర్రి ఘటనపై పవన్ కల్యాణ్ ఆవేదన.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే..!
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
మరోవైపు, భారతీయ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆన్లైన్లో డెబిట్ కార్డ్ వినియోగదారుల కంటే 40 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తాజా అధ్యయనం తేల్చింది.. క్రెడిట్ కార్డ్ల కారణంగా ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేయడానికి సులువు కావడంతో క్రమంగా వాటికి ఆదరణ పెరుగుతోంది.. క్రెడిట్ కార్డ్లు, మొత్తం డెబిట్ కార్డ్లలో 10 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆన్లైన్ ఖర్చులకు సంబంధించినంత వరకు క్రెడిట్ కార్డులపై 3 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్లో 2 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.. అయితే, వారు ఇంటర్నెట్పై మరింత అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!