WPI Inflation: 30 ఏళ్ల గరిష్టానికి టోకు ధరల సూచీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం) పెరుగుతూ పోతోంది.. ఈ ఏడాది ఏప్రిల్లో 15.08 శాతంగా నమోదు కాగా.. ఇక, మే నెలలో 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుని 15.88 శాతంగా నమోదైంది.. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు.. కాగా, ఏప్రిల్లోనే 30 ఏళ్ల గరిష్టాన్ని తాకింది టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం.. ఇప్పుడు అది కొనసాగిస్తూ.. మరింత పైకి కదలడం ఆందోళన కలిగించే విషయం.. మేలో, భారతదేశంలో పట్టణ ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉండగా.. గ్రామీణ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది.. ఇది కేరళలో అత్యల్పంగా 4.8 శాతంగా ఉంటే.. తెలంగాణలో అత్యధికంగా 9.5 శాతానికి చేరింది.. ఇక, రూపాయితో డాలర్ మారకం విలువ బలపడే విధంగా ఆర్బీఐ ప్రయత్నాలు చేయకపోవడం కారణంగా రూపాయి విలువ 82కి పడిపోవచ్చుననే అంచనాలు నెలకొన్నాయి.. ఈ ఏడాది జనవరి 1న డాలర్తో 74.51గా ఉన్న రూపాయి మారకం విలువ ఈ ఏడాది 5.9 శాతం క్షీణించి 78.95కి చేరుకుంది. పెరుగుతున్న డాలర్ ఇండెక్స్, వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం రూపాయి క్షీణతకు ప్రధాన కారణం అనే ఆందోళనలు నెలకొన్నాయి.. ఇది ఇలాగే కొనసాగితే రూపాయి విలువ 82కు చేరుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
Read Also: Pawan Kalyan: తాడిమర్రి ఘటనపై పవన్ కల్యాణ్ ఆవేదన.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే..!
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
మరోవైపు, భారతీయ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆన్లైన్లో డెబిట్ కార్డ్ వినియోగదారుల కంటే 40 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తాజా అధ్యయనం తేల్చింది.. క్రెడిట్ కార్డ్ల కారణంగా ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేయడానికి సులువు కావడంతో క్రమంగా వాటికి ఆదరణ పెరుగుతోంది.. క్రెడిట్ కార్డ్లు, మొత్తం డెబిట్ కార్డ్లలో 10 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆన్లైన్ ఖర్చులకు సంబంధించినంత వరకు క్రెడిట్ కార్డులపై 3 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్లో 2 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.. అయితే, వారు ఇంటర్నెట్పై మరింత అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!