Warren Buffett: $140 బిలియన్లకు అధిపతి.. పసిడిలో మాత్రం పైసా పెట్టలేదు.. ఎందుకో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పెట్టుబడిదారుడిగా గుర్తింపు పొందిన ఫేమస్ పర్సన్ వారెన్ బఫెట్. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో వారెన్ బఫెట్ను ఒక తిరుగులేని రారాజు అని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 140 బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12 లక్షల కోట్లు. మీకు తెలుసా.. ఇన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన ఆయనకు.. బంగారంలో పైసా కూడా పెట్టుబడి పెట్టలేదంటే నమ్ముతారా.. కానీ ఇదే నిజం.. అసలు ఆయన పడిసిని పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Rainy Season: వర్షాకాలంలో తడిస్తే ఎన్ని ప్రయోజనాలో..!
Also Read
- Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
బఫెట్ బంగారాన్ని ఎందుకు కొనడు..?
మీరు ఒక ఔన్స్ బంగారాన్ని కొనుగోలు చేసి, దానిని సంవత్సరాలుగా ఉంచుకుంటే, సంవత్సరాల తర్వాత కూడా మీ దగ్గర అదే మొత్తంలో బంగారం ఉంటుందని.. అది పెరగడం లేదా కొత్తగా ఏమీ ఉత్పత్తి చేయదని వారెన్ బఫెట్ నమ్ముతాడు. బంగారాన్ని ఆభరణాలకు, కొన్ని పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని, కానీ పెట్టుబడిగా అది దీర్ఘకాలంలో పొలాలు లేదా వ్యాపారాలు వంటి ఉత్పాదక ఆస్తుల కంటే బలహీనంగా ఉంటుందని ఆయన చెప్పారు. 2011లో, బంగారానికి రెండు ప్రధాన ప్రతికూలతలు ఉన్నాయని ఆయన వాటాదారులకు వెల్లడించారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉండదు, కొత్తగా ఏమీ ఉత్పత్తి చేయదు. ఈ ఆలోచన కారణంగానే, బఫెట్ ఎప్పుడూ నేరుగా బంగారంలో పెట్టుబడి పెట్టలేదు. కానీ ఆయన ఒకప్పుడు బంగారు మైనింగ్ కంపెనీ బారిక్ గోల్డ్లో డబ్బు పెట్టుబడి పెట్టాడు. కానీ కేవలం ఆరు నెలల్లోనే దాని నుంచి బయటపడ్డాడు.
పడిసి గురించి ఆయన అభిప్రాయం తప్పా..?
2011లో బంగారం ధర $1,750గా ఉంది, నేడు అది దాదాపు $3,350గా మారింది. అంటే, 14 ఏళ్లలో అది రెట్టింపు అయ్యింది. ఈనేపథ్యంలో బఫెట్ నిర్ణయం తప్పని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ నివేదికలను గమనిస్తే.. బంగారం వార్షిక రాబడి (CAGR) కేవలం 5 శాతం మాత్రమే. అదే కాలంలో US స్టాక్ మార్కెట్ 14 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దీని ప్రకారం బఫెట్ ఆలోచన సరైనదని తేలింది. 2011 నుంచి 2020 వరకు బంగారం ధర పడిపోయి.. తరువాత పాత స్థాయికి తిరిగి వచ్చింది. నిజమైన బూమ్ 2020 తర్వాత పసిడికి వచ్చింది. 5 ఏళ్లలో 90 శాతం మేర ధరలో పెరుగుదల వచ్చింది. పెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందని అంటారాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం.
READ MORE: WAR 2 Pre Release Event : వార్-2లో ఊహించని పాయింట్ ఉంది : అయాన్ ముఖర్జీ
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!