Warren Buffett: $140 బిలియన్లకు అధిపతి.. పసిడిలో మాత్రం పైసా పెట్టలేదు.. ఎందుకో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warren Buffett: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పెట్టుబడిదారుడిగా గుర్తింపు పొందిన ఫేమస్ పర్సన్ వారెన్ బఫెట్. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో వారెన్ బఫెట్ను ఒక తిరుగులేని రారాజు అని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 140 బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12 లక్షల కోట్లు. మీకు తెలుసా.. ఇన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన ఆయనకు.. బంగారంలో పైసా కూడా పెట్టుబడి పెట్టలేదంటే నమ్ముతారా.. కానీ ఇదే నిజం.. అసలు ఆయన పడిసిని పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Rainy Season: వర్షాకాలంలో తడిస్తే ఎన్ని ప్రయోజనాలో..!
Also Read
- Campa Cola vs Coca-Cola: 'కోలా వార్'లో కొత్త మలుపు.. అంబానీ 'క్యాంపా' దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
- Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
- Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
- Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
బఫెట్ బంగారాన్ని ఎందుకు కొనడు..?
మీరు ఒక ఔన్స్ బంగారాన్ని కొనుగోలు చేసి, దానిని సంవత్సరాలుగా ఉంచుకుంటే, సంవత్సరాల తర్వాత కూడా మీ దగ్గర అదే మొత్తంలో బంగారం ఉంటుందని.. అది పెరగడం లేదా కొత్తగా ఏమీ ఉత్పత్తి చేయదని వారెన్ బఫెట్ నమ్ముతాడు. బంగారాన్ని ఆభరణాలకు, కొన్ని పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని, కానీ పెట్టుబడిగా అది దీర్ఘకాలంలో పొలాలు లేదా వ్యాపారాలు వంటి ఉత్పాదక ఆస్తుల కంటే బలహీనంగా ఉంటుందని ఆయన చెప్పారు. 2011లో, బంగారానికి రెండు ప్రధాన ప్రతికూలతలు ఉన్నాయని ఆయన వాటాదారులకు వెల్లడించారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉండదు, కొత్తగా ఏమీ ఉత్పత్తి చేయదు. ఈ ఆలోచన కారణంగానే, బఫెట్ ఎప్పుడూ నేరుగా బంగారంలో పెట్టుబడి పెట్టలేదు. కానీ ఆయన ఒకప్పుడు బంగారు మైనింగ్ కంపెనీ బారిక్ గోల్డ్లో డబ్బు పెట్టుబడి పెట్టాడు. కానీ కేవలం ఆరు నెలల్లోనే దాని నుంచి బయటపడ్డాడు.
పడిసి గురించి ఆయన అభిప్రాయం తప్పా..?
2011లో బంగారం ధర $1,750గా ఉంది, నేడు అది దాదాపు $3,350గా మారింది. అంటే, 14 ఏళ్లలో అది రెట్టింపు అయ్యింది. ఈనేపథ్యంలో బఫెట్ నిర్ణయం తప్పని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ నివేదికలను గమనిస్తే.. బంగారం వార్షిక రాబడి (CAGR) కేవలం 5 శాతం మాత్రమే. అదే కాలంలో US స్టాక్ మార్కెట్ 14 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దీని ప్రకారం బఫెట్ ఆలోచన సరైనదని తేలింది. 2011 నుంచి 2020 వరకు బంగారం ధర పడిపోయి.. తరువాత పాత స్థాయికి తిరిగి వచ్చింది. నిజమైన బూమ్ 2020 తర్వాత పసిడికి వచ్చింది. 5 ఏళ్లలో 90 శాతం మేర ధరలో పెరుగుదల వచ్చింది. పెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందని అంటారాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం.
READ MORE: WAR 2 Pre Release Event : వార్-2లో ఊహించని పాయింట్ ఉంది : అయాన్ ముఖర్జీ
తాజావార్తలు
-
UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!