Adani Group: గౌతమ్ అదానీ, సమీప బంధువు సాగర్కి సమన్లు
- అదానీ, సమీప బంధువు సాగర్కి యూఎస్ సమన్లు
- 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
- అదానీ ఇచ్చిన అభియోగాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిద్దరిపై అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా.. ఈ దర్యాప్తులో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఎన్ఫోర్స్మెంట్ విభాగం యాక్టింగ్ డైరెక్టర్ సంజయ్ వాధ్వా కీలక పాత్ర పోషిస్తున్నారు.
అదానీ ఇచ్చిన అభియోగాలు?
గౌతమ్ అదానీ (Gautam Adani), సాగర్ అదానీ ఒక ఆఫర్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రీన్ బాండ్లను కొనుగోలు చేయడానికి యుఎస్ (usa)పెట్టుబడిదారులను ప్రేరేపించారు. అదానీ గ్రీన్ ప్రాజెక్ట్ భారత్ లో విజయవంతం అవుతుందని, అందుకు వీలుగా ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు పెద్ద ఎత్తున లంచాలను ఇచ్చామని వారు యుఎస్ పెట్టుబడిదారులకు చెప్పారు. ఇది అమెరికాలో సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘన అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ స్పష్టం చేసింది.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
స్పందించిన సంజయ్ వాధ్వా
సౌర విద్యుత్ ఒప్పందాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించడానికిి భారత ప్రభుత్వ ఉన్నతాధికారులకు సుమారు రూ.2,100 కోట్ల మేర లంచం ఇచ్చినట్టు అదానీ ప్రతినిధులపై హైప్రొఫైల్ లంచం ఆరోపణలు కేంద్రీకృతమయ్యాయి. వైట్ హౌజ్ స్పందించేవరకు వెళ్లిన ఈ అభియోగాలపై దర్యాప్తును సంజయ్ వాధ్వా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సెక్యూరిటీల ఉల్లంఘనలకు కార్పొరేట్ లీడర్లను బాధ్యులను చేయడంలో వాధ్వాది అందెవేసిన చేయి. సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించినందుకు సీనియర్ కార్పొరేట్ అధికారులు, డైరెక్టర్లతో సహా ఇందులో పాత్ర ఉన్న అందరినీ కమిషన్ విచారిస్తుందని ఇటీవల ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!