Adani Group: గౌతమ్ అదానీ, సమీప బంధువు సాగర్కి సమన్లు
- అదానీ, సమీప బంధువు సాగర్కి యూఎస్ సమన్లు
- 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
- అదానీ ఇచ్చిన అభియోగాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిద్దరిపై అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా.. ఈ దర్యాప్తులో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఎన్ఫోర్స్మెంట్ విభాగం యాక్టింగ్ డైరెక్టర్ సంజయ్ వాధ్వా కీలక పాత్ర పోషిస్తున్నారు.
అదానీ ఇచ్చిన అభియోగాలు?
గౌతమ్ అదానీ (Gautam Adani), సాగర్ అదానీ ఒక ఆఫర్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రీన్ బాండ్లను కొనుగోలు చేయడానికి యుఎస్ (usa)పెట్టుబడిదారులను ప్రేరేపించారు. అదానీ గ్రీన్ ప్రాజెక్ట్ భారత్ లో విజయవంతం అవుతుందని, అందుకు వీలుగా ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు పెద్ద ఎత్తున లంచాలను ఇచ్చామని వారు యుఎస్ పెట్టుబడిదారులకు చెప్పారు. ఇది అమెరికాలో సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘన అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ స్పష్టం చేసింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
స్పందించిన సంజయ్ వాధ్వా
సౌర విద్యుత్ ఒప్పందాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించడానికిి భారత ప్రభుత్వ ఉన్నతాధికారులకు సుమారు రూ.2,100 కోట్ల మేర లంచం ఇచ్చినట్టు అదానీ ప్రతినిధులపై హైప్రొఫైల్ లంచం ఆరోపణలు కేంద్రీకృతమయ్యాయి. వైట్ హౌజ్ స్పందించేవరకు వెళ్లిన ఈ అభియోగాలపై దర్యాప్తును సంజయ్ వాధ్వా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సెక్యూరిటీల ఉల్లంఘనలకు కార్పొరేట్ లీడర్లను బాధ్యులను చేయడంలో వాధ్వాది అందెవేసిన చేయి. సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించినందుకు సీనియర్ కార్పొరేట్ అధికారులు, డైరెక్టర్లతో సహా ఇందులో పాత్ర ఉన్న అందరినీ కమిషన్ విచారిస్తుందని ఇటీవల ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!