UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ
- కొత్తగా యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ?
- వ్యాపారులకు కొత్త ఛార్జీలపై నిపుణుల హెచ్చరిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో యూపీఐ ఛార్జీలపై రగడ నడుస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ప్రాతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. UPI చెల్లింపులపై కొత్తగా GST భారం కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.2,000కు మించిన UPI లావాదేవీలకు వర్తించే Merchant Discount Rate (MDR) ఛార్జీలపై 18 శాతం GST విధించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన UPI చెల్లింపులకు సంబంధించి వ్యాపారులు చెల్లించే MDR ఛార్జీలపై 18 శాతం GST విధించాల్సి రావచ్చని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ MDR చెల్లింపులపై వ్యాపారులు Input Tax Credit (ITC) పొందే అవకాశం ఉండటంతో మొత్తం పన్ను భారం కొంతవరకు తగ్గుతుందని వివరించారు.
Also Read
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ప్రభుత్వానికి భారీ ఆదాయం?
UPI లావాదేవీలపై MDRకు GST వర్తింపజేస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు GST ఆదాయం సమకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం UPI చెల్లింపులపై MDR విధానం, దానిపై GST వర్తింపు అంశం చర్చనీయాంశంగా మారింది. రూ.2,000కు మించిన లావాదేవీలపై ఈ విధానం అమల్లోకి వస్తే.. ముఖ్యంగా అధిక విలువైన డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులపై దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!