PM Shram Yogi Maandhan Yojana: ఈ స్కీమ్ లో చేరితే.. ప్రతి నెల రూ. 3 వేలు పొందే ఛాన్స్!
- అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం స్కీమ్
- ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన
- ప్రతి నెల రూ. 3 వేలు పొందొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చీకుచింతా లేకుండా జీవించొచ్చు. దీనికోసం ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అయితే పొదుపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ కూడా కావాలంటే ఈపీఎఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ వెసులుబాటు ఉండదు. అయితే వీరికి కూడా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెల రూ. 3 వేలు పొందొచ్చు.
అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులు ఈ పథకంలో చేరొచ్చు. ఇది ఒక స్వచ్ఛంద పెన్షన్ స్కీమ్. నెలకు రూ. 15 వేల కంటే తక్కువ వేతనం పొందుతున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరేందుకు అర్హులు. ఈ పథకంలో చందాదారుడు ఎంత జమ చేస్తే.. తిరిగి ప్రభుత్వం కూడా అంతే జమ చేస్తుంది. ఇక సభ్యుడికి 60 ఏళ్లు వచ్చాక.. నెలకు రూ. 3 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. 60 సంవత్సరాల కంటే ముందే మరణిస్తే.. జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించొచ్చు. కాగా ఈ పథకంలో 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 55 జమ చేయాల్సి ఉంటుంది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది కాబట్టి అప్పుడు నెలకు రూ. 110 చొప్పున మీ మాన్ధన్ అకౌంట్లో జమ అవుతుంది. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తూ ఉండాలి. స్కీంలో చేరిన తర్వాత పది సంవత్సరాల కంటే ముందే నిష్క్రమిస్తే.. చందాదారుడు జమ చేసిన మొత్తానికి వడ్డీ కలిపి అందిస్తారు. అయితే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజనలో వయసు పెరుగుతున్న కొద్దీ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. గరిష్టంగా నెలకు రూ. 200 వరకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీంలో చేరాడానికి మాన్ధన్.ఇన్ వెబ్సైట్కి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లకు (CSC) వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ స్కీంలో చేరేందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్, ఆధార్ కార్డు ఉండాలి. ముఖ్యంగా వీధి వ్యాపారులు, రిక్షా నడిపేవారు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వంటి వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఈ పథకంలో చేరిన వారు టాక్స్ పేయర్ అయి ఉండకూడదు. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీంలో భాగం అయి ఉండకూడదు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!