PM Shram Yogi Maandhan Yojana: ఈ స్కీమ్ లో చేరితే.. ప్రతి నెల రూ. 3 వేలు పొందే ఛాన్స్!
- అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం స్కీమ్
- ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన
- ప్రతి నెల రూ. 3 వేలు పొందొచ్చు
అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చీకుచింతా లేకుండా జీవించొచ్చు. దీనికోసం ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అయితే పొదుపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ కూడా కావాలంటే ఈపీఎఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ వెసులుబాటు ఉండదు. అయితే వీరికి కూడా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెల రూ. 3 వేలు పొందొచ్చు.
అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులు ఈ పథకంలో చేరొచ్చు. ఇది ఒక స్వచ్ఛంద పెన్షన్ స్కీమ్. నెలకు రూ. 15 వేల కంటే తక్కువ వేతనం పొందుతున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరేందుకు అర్హులు. ఈ పథకంలో చందాదారుడు ఎంత జమ చేస్తే.. తిరిగి ప్రభుత్వం కూడా అంతే జమ చేస్తుంది. ఇక సభ్యుడికి 60 ఏళ్లు వచ్చాక.. నెలకు రూ. 3 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. 60 సంవత్సరాల కంటే ముందే మరణిస్తే.. జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించొచ్చు. కాగా ఈ పథకంలో 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 55 జమ చేయాల్సి ఉంటుంది.
Also Read
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది కాబట్టి అప్పుడు నెలకు రూ. 110 చొప్పున మీ మాన్ధన్ అకౌంట్లో జమ అవుతుంది. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తూ ఉండాలి. స్కీంలో చేరిన తర్వాత పది సంవత్సరాల కంటే ముందే నిష్క్రమిస్తే.. చందాదారుడు జమ చేసిన మొత్తానికి వడ్డీ కలిపి అందిస్తారు. అయితే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజనలో వయసు పెరుగుతున్న కొద్దీ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. గరిష్టంగా నెలకు రూ. 200 వరకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీంలో చేరాడానికి మాన్ధన్.ఇన్ వెబ్సైట్కి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లకు (CSC) వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ స్కీంలో చేరేందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్, ఆధార్ కార్డు ఉండాలి. ముఖ్యంగా వీధి వ్యాపారులు, రిక్షా నడిపేవారు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వంటి వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఈ పథకంలో చేరిన వారు టాక్స్ పేయర్ అయి ఉండకూడదు. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీంలో భాగం అయి ఉండకూడదు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!