PM Shram Yogi Maandhan Yojana: ఈ స్కీమ్ లో చేరితే.. ప్రతి నెల రూ. 3 వేలు పొందే ఛాన్స్!
- అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం స్కీమ్
- ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన
- ప్రతి నెల రూ. 3 వేలు పొందొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చీకుచింతా లేకుండా జీవించొచ్చు. దీనికోసం ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్లాన్ చేసుకోవాలి. అయితే పొదుపు మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ కూడా కావాలంటే ఈపీఎఫ్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ వెసులుబాటు ఉండదు. అయితే వీరికి కూడా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెల రూ. 3 వేలు పొందొచ్చు.
అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులు ఈ పథకంలో చేరొచ్చు. ఇది ఒక స్వచ్ఛంద పెన్షన్ స్కీమ్. నెలకు రూ. 15 వేల కంటే తక్కువ వేతనం పొందుతున్న వారు ఈ పథకంలో చేరొచ్చు. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరేందుకు అర్హులు. ఈ పథకంలో చందాదారుడు ఎంత జమ చేస్తే.. తిరిగి ప్రభుత్వం కూడా అంతే జమ చేస్తుంది. ఇక సభ్యుడికి 60 ఏళ్లు వచ్చాక.. నెలకు రూ. 3 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. 60 సంవత్సరాల కంటే ముందే మరణిస్తే.. జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించొచ్చు. కాగా ఈ పథకంలో 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 55 జమ చేయాల్సి ఉంటుంది.
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుంది కాబట్టి అప్పుడు నెలకు రూ. 110 చొప్పున మీ మాన్ధన్ అకౌంట్లో జమ అవుతుంది. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లిస్తూ ఉండాలి. స్కీంలో చేరిన తర్వాత పది సంవత్సరాల కంటే ముందే నిష్క్రమిస్తే.. చందాదారుడు జమ చేసిన మొత్తానికి వడ్డీ కలిపి అందిస్తారు. అయితే ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజనలో వయసు పెరుగుతున్న కొద్దీ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. గరిష్టంగా నెలకు రూ. 200 వరకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీంలో చేరాడానికి మాన్ధన్.ఇన్ వెబ్సైట్కి వెళ్లి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లకు (CSC) వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ స్కీంలో చేరేందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్, ఆధార్ కార్డు ఉండాలి. ముఖ్యంగా వీధి వ్యాపారులు, రిక్షా నడిపేవారు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు వంటి వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఈ పథకంలో చేరిన వారు టాక్స్ పేయర్ అయి ఉండకూడదు. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీంలో భాగం అయి ఉండకూడదు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!