విస్తారా ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకొంది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో తొలి 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను అందించాలని నిర్ణయం తీసుకుంది. టాటా -సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్లైన్స్ అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారికి 20 నిమిషాల ఉచిత వై-ఫైని అందించనున్నట్లు తెలిపింది. విస్తారా అనేది టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్గా ఉంది. ఎయిర్లైన్ 53 ఎయిర్బస్ A320neo, 10 Airbus A321neo మరియు 7 బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానాలతో సహా 70 విమానాల్లో ఈ సదుపాయం కల్పించనుంది.
ఇది కూడా చదవండి: Nirmala Sitharaman: మమత వ్యాఖ్యల్ని ఖండించిన ఆర్థికమంత్రి
20 నిమిషాల పాటు వైఫై యాక్సెస్ అన్ని క్యాబిన్లలోని ప్రయాణీకులను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. అనంతరం భారతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్లను ఉపయోగించి వైఫైనే పొడిగించుకోవచ్చు. ప్లాన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనువైనదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను తీసుకొచ్చామని, ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని విస్తారా ప్రతినిధి దీపక్ రాజావత్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Memory: జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని నియమాలు..తప్పక పాటించండి..