Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News The Price Of Pulses Is Rs 140 To Rs 180 Increase Chance

Toor dal: దేశవ్యాప్తంగా కందిపప్పు కష్టాలు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్‌..!

Published Date :May 20, 2023 , 11:52 am
By NTV WebDesk
Toor dal: దేశవ్యాప్తంగా కందిపప్పు కష్టాలు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Toor dal rates hiked: దేశంలో పప్పుల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ పరిణామం పేద కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోంది. పప్పుధాన్యాలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే రేషన్‌కార్డుల్లో ఇవ్వడంతో ఇతర ప్రాంతాల వారికి వాటిని కొనడం కష్టంగా ఉంది. ఇప్పుడు పప్పుల ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా పప్పులు సరఫరా కాకపోవడంతో సూపర్‌మార్కెట్లతోపాటు కిరాణా దుకాణాల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కందిపప్పును కాస్తోకూస్తో అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ. రూ.140కి పెరిగిన ధర రూ.180కి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వేసవిలో కందిపప్పు వినియోగం కొంతమేర తగ్గుతుందని, రానున్న వర్షాకాలం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు సరిపడా సరఫరా కాకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్ లో రెండు నెలల క్రితం వరకు రూ. 100 నుంచి రూ. 103, కందిపప్పు ఇప్పుడు రిటైల్ రూ. 140 వరకు పలుకగా.. గతేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల పప్పుధాన్యాలు పండగా మరో 15 లక్షల టన్నులు దిగుమతి అయ్యాయి. అయితే ఈ ఏడాది దిగుబడి 38.9 లక్షల టన్నులు దాటలేదు. దీనికి తోడు దిగుమతి విషయంలో కేంద్రం అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్రం పప్పు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.6,600గా ప్రకటించింది. కానీ ప్రస్తుతానికి క్వింటాల్ పప్పులు రూ. 10 నుంచి రూ. 12 పలుకుతుంది.

Read also: Traffic Restrictions: నేడు కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఇటీవల ఏప్రిల్ 3న కిలో పప్పు ధర 120 నుంచి 130 రూపాయలకు పెరిగిన విషయం తెలిసిందే. మినపగుండ్లు కూడా 130 నుంచి 140 రూపాయలకు చేరింది. ఈ రెండు నెలల్లోనే చిల్లర వ్యాపారులు కిలోకు రూ.10 అదనంగా పెంచారు. ప్రధానంగా పప్పుల కొరత ధరల పెరుగుదలకు కారణం. దీనికి తోడు డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు రాబట్టుకునేందుకు వ్యాపారులు కొన్ని ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పప్పుల దిగుబడి గణనీయంగా తగ్గడం ధరలపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా రైతులు యాసంగి కందులను ఫిబ్రవరి నుంచి వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి తీసుకువస్తారు. కానీ, కందులు, పెసలు, మినుము దిగుబడులు తగ్గడంతో మార్కెట్లకు సరిగా చేరడం లేదు. దీంతో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేందుకు పప్పుధాన్యాలను అక్రమంగా నిల్వ ఉంచితే సహించేది లేదని కేంద్రం ఇటీవల హోల్ సేల్ వ్యాపారులను హెచ్చరించింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం 12 లక్షల టన్నుల పప్పు దినుసులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఒక్క డిసెంబర్‌లోనే 2 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాం. గత జూలై నుండి డిసెంబర్ వరకు భారీ వర్షాలు దేశంలో పప్పుధాన్యాల దిగుబడిని తగ్గించాయి.

Read also: RBI Guidelines: 2వేల నోట్లు రద్దు.. సామాన్యుల సందేహాలకు ఆర్బీఐ సమాధానం

తేమ ఎక్కువగా ఉండడంతో పైర్లకు తెగుళ్లు సోకినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. గతేడాది కందు, మినుములు, పెసలు మొత్తం 22 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని కేంద్రం ప్రాథమిక లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ లక్ష్యం కంటే 24 లక్షల టన్నుల దిగుబడి తగ్గింది. 45.50 లక్షల టన్నుల మాంసం వస్తుందని నిర్దేశిస్తే.. 36.66 లక్షల టన్నులు మాత్రమే వచ్చాయి. దిగుబడులపై స్పష్టత రావడంతో డిసెంబర్ లోనే దిగుమతులను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య- మార్క్‌ఫెడ్‌ ప్రకారం తెలంగాణలో కందులు, మినుములు, పెసలు కొనుగోలు చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసినా రైతులు ఎవరూ విక్రయించేందుకు ముందుకు రావడం లేదు. పంట దిగుబడి తగ్గడంతో ప్రైవేట్ వ్యాపారులు రైతుల వద్దకు వెళ్లి అధిక ధరలకు కందులను కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి విక్రయించడం లేదని అధికారులు వివరించారు. రాష్ట్రంలో కంది, పెసలు, వేరుశనగ కొరత ఉంది. ఈ పంటల సాగు విస్తీర్ణం ఊహించని విధంగా పెరగడంతో పాటు సకాలంలో వర్షాలు కురవకపోవడం, దిగుబడి తగ్గడంతో కొరత ఏర్పడింది. 2022-23లో సాధారణ విస్తీర్ణం కంటే 12 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు అవుతుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ చివరకు దిగుబడి అంచనా నివేదికలో ప్రభుత్వానికి 5.65 లక్షల ఎకరాలు అందినట్లు స్పష్టమైంది. రాష్ట్రంలో ఎపి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులు సైతం కందులను మార్కెట్లకు విక్రయానికి తీసుకువస్తే వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్లడంతో కొరత ఎక్కువగా ఉంది. మినుము, వరి పంటల సాగు, దిగుబడులు కూడా తగ్గాయి.
Russia : అమెరికా ప్రముఖులపై ర‌ష్యా నిషేధం.. మాజీ అధ్యక్షుడు ఒబామాతో సహా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • No Stock Boards
  • telangana
  • TOOR DAL
  • Toor Dal Rates
  • Toor dal rates hiked

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions