TCS Number One: దటీజ్.. టీసీఎస్. దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్. నంబర్ వన్ పొజిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Number One: ఐటీ సర్వీసుల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఇండియాలోనే అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ వ్యాల్యూ రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగి 45 పాయింట్ 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మేరకు కాంతర్ బ్రాన్జ్ ఇండియా ర్యాంకింగ్ సంస్థ ఒక జాబితాను రూపొందించింది. ఈ లిస్టులో టీసీఎస్.. హెచ్డీఎఫ్సీ బ్యాంకును మరియు ఇన్ఫోసిస్ను దాటి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. బ్రాండ్ వ్యాల్యూ 212 శాతం పెరగటంతో ఈ ఘనత సాధించింది. ఈ లిస్టులో ఎక్కువ కాలంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకే టాపర్గా నిలుస్తోంది. ఈ ర్యాంకులను 2014లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ సంస్థే నంబర్ వన్గా కొనసాగి ఇప్పుడు రెండో స్థానానికి పరిమితం అయింది.
1.62 % పెరిగిన ఎగుమతులు
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
గతేడాది ఆగస్టు కన్నా ఈసారి మన దేశ ఎగుమతులు 1 పాయింట్ ఆరు రెండు శాతం పెరిగాయి. ఈ షిప్మెంట్ల విలువ 33 పాయింట్ తొమ్మిది రెండు బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరగటం, సప్లై చెయిన్లో అంతరాయాలు నెలకొనటంతో 33 బిలియన్ డాలర్ల విలువైన ఎక్స్పోర్టులు మాత్రమే జరుగుతాయని ప్రాథమికంగా అంచనా వేయగా అంతకుమించి జరగటం విశేషం. అయితే.. ఇంజనీరింగ్ గూడ్స్, జెమ్స్, జ్యూలరీ మరియు టెక్స్టైల్స్ వంటి కీలక వస్తువులకు విదేశాల్లో డిమాండ్ తగ్గింది.
‘ఐడీబీఐ’ కోసం త్వరలో బిడ్లు
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఈ బ్యాంక్లో ప్రభుత్వానికి ప్రస్తుతం 45 పాయింట్ నాలుగు ఎనిమిది శాతం వాటా ఉంది. ప్రమోటర్గా వ్యవహరిస్తున్న ఎల్ఐసీ 49 పాయింట్ రెండు నాలుగు శాతం స్టేక్ను కలిగి ఉంది. ఐడీబీఐ బ్యాంక్లోని పెట్టుబడుల ఉపసంహరణకు మరియు మేనేజ్మెంట్ బదిలీకి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2021 మే నెలలోనే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..