TCS Number One: దటీజ్.. టీసీఎస్. దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్. నంబర్ వన్ పొజిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Number One: ఐటీ సర్వీసుల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఇండియాలోనే అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ వ్యాల్యూ రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగి 45 పాయింట్ 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మేరకు కాంతర్ బ్రాన్జ్ ఇండియా ర్యాంకింగ్ సంస్థ ఒక జాబితాను రూపొందించింది. ఈ లిస్టులో టీసీఎస్.. హెచ్డీఎఫ్సీ బ్యాంకును మరియు ఇన్ఫోసిస్ను దాటి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. బ్రాండ్ వ్యాల్యూ 212 శాతం పెరగటంతో ఈ ఘనత సాధించింది. ఈ లిస్టులో ఎక్కువ కాలంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకే టాపర్గా నిలుస్తోంది. ఈ ర్యాంకులను 2014లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ సంస్థే నంబర్ వన్గా కొనసాగి ఇప్పుడు రెండో స్థానానికి పరిమితం అయింది.
1.62 % పెరిగిన ఎగుమతులు
Also Read
- Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
- UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
- Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
గతేడాది ఆగస్టు కన్నా ఈసారి మన దేశ ఎగుమతులు 1 పాయింట్ ఆరు రెండు శాతం పెరిగాయి. ఈ షిప్మెంట్ల విలువ 33 పాయింట్ తొమ్మిది రెండు బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరగటం, సప్లై చెయిన్లో అంతరాయాలు నెలకొనటంతో 33 బిలియన్ డాలర్ల విలువైన ఎక్స్పోర్టులు మాత్రమే జరుగుతాయని ప్రాథమికంగా అంచనా వేయగా అంతకుమించి జరగటం విశేషం. అయితే.. ఇంజనీరింగ్ గూడ్స్, జెమ్స్, జ్యూలరీ మరియు టెక్స్టైల్స్ వంటి కీలక వస్తువులకు విదేశాల్లో డిమాండ్ తగ్గింది.
‘ఐడీబీఐ’ కోసం త్వరలో బిడ్లు
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఈ బ్యాంక్లో ప్రభుత్వానికి ప్రస్తుతం 45 పాయింట్ నాలుగు ఎనిమిది శాతం వాటా ఉంది. ప్రమోటర్గా వ్యవహరిస్తున్న ఎల్ఐసీ 49 పాయింట్ రెండు నాలుగు శాతం స్టేక్ను కలిగి ఉంది. ఐడీబీఐ బ్యాంక్లోని పెట్టుబడుల ఉపసంహరణకు మరియు మేనేజ్మెంట్ బదిలీకి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2021 మే నెలలోనే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!