Amazon Special Delivery Station in Andhra Pradesh: ఏపీకి ‘అమేజాన్’ కిరీటం.. దేశంలోనే అతిపెద్ద ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్
Amazon Special delivery station in Andhra Pradesh: అమేజాన్ సంస్థ ఇండియాలోనే అతిపెద్ద ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్ను ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ప్రారంభించింది. ఈ కంపెనీకి దేశం మొత్తమ్మీద ఏడు ఉమెన్ డెలివరీ కేంద్రాలు ఉండగా ఇది ఏపీలో రెండోది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ సెంటర్లో 50 మంది మహిళలు పనిచేస్తారు. అమేజాన్ డెలివరీ సర్వీస్ పార్ట్నర్తో కలిసి ఈ స్టేషన్ను ఏర్పాటుచేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్కు అమేజాన్ ఇలా ప్రత్యేక గుర్తింపు తీసుకురావటం (కిరీటం పెట్టడం) హర్షించదగ్గ పరిణామమనే టాక్ వినిపిస్తోంది.
ఎస్బీఐ.. బీపీఎల్ఆర్ పెంపు
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ని సున్నా పాయింట్ 7 శాతం పెంచింది. తద్వారా ఈ రేట్ని ఏడాదికి 13 పాయింట్ నాలుగు ఐదు శాతానికి చేర్చింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. దీనివల్ల BPLRతో లింకైన లోన్ రీపేమెంట్లు భారం కానున్నాయి. BPLRని చివరిసారిగా జూన్లో 12 పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోంది. ఈ బ్యాంక్.. బేస్ రేట్ బేసిస్ పాయింట్లను కూడా ఇదే స్థాయిలో హైక్ చేసి 8 పాయింట్ 7 శాతానికి తీసుకెళ్లింది.
2 కోట్లకు డీల్షేర్ కస్టమర్లు
సోషల్ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అయిన డీల్షేర్ కస్టమర్ల సంఖ్య 2 కోట్లకు చేరింది. ఇందులో ఎక్కువ శాతం మంది ఇండియాలోని టయర్-2, టయర్-3 నగరాల్లో తొలిసారి ఇంటర్నెట్ వాడుతున్న వినియోగదారులేనని సంస్థ వెల్లడించింది. తాము దోస్త్ మోడల్ అనే ఎకోసిస్టమ్ని ఫాలో అవుతున్నామని తెలిపింది. సోషల్ నెట్వర్క్లను విస్తృతంగా వాడే కమ్యూనిటీ లీడర్లు మరియు స్థానికంగా ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలపై మంచి పట్టున్నవాళ్లు ఈ బ్రాండ్ ప్రొడక్టులను ఆఫ్లైన్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారని పేర్కొంది. ఈ విధంగా 20 వేల మందికి పైగా ఉద్యోగాలు పొందారని ఓ ప్రకటనలో తెలిపింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇండియా స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ మరోసారి 60 వేలకు పైనే ట్రేడ్ అవుతుండటం విశేషం. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 18 వేలు దాటింది. బ్యాంక్ ఇండెక్స్ రికార్డ్ స్థాయికి చేరింది. ఎస్బీఐ, పీవీఆర్, టీఎంబీ, సీఈ ఇన్ఫో షేర్లు ఆశాజనకంగా ఉన్నాయి. వాటిలో ఈరోజు పెట్టుబడి పెట్టే అవకాశాలను పరిశీలించొచ్చు. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.27 వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!