TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- వరస లేఆఫ్స్ మధ్య టీసీఎస్ కొత్త సాలరీ పాలసీ..
- ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి..
- జీతాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: వరస లేఆఫ్స్ తో టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. వేరియబెల్ పే విధానాన్ని మార్చి, ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 6 లక్షల మంది ఉద్యోగులపై ఇది ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు వేరియబుల్ పే రూపంలో నెలవారీగా లేదా క్వార్టర్లీ వారీగా అందుతున్న మొత్తాన్ని ఇప్పటి నుంచి ‘‘మంత్లీ పర్ఫామెన్స్ పే’’గా మార్చారు. దీంతో ఉద్యోగులు ఆఫీస్ హాజరు, ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ ఆధారంగా నిర్ణయించనున్నారు. దీని కారణంగా ఆఫీస్ తక్కువగా వచ్చే ఉద్యోగులకు టేక్-హోమ్ సాలరీ తగ్గే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, ఈ ఏడాది టీసీస్ సాధారణంగా 5 శాతం నుంచి 8 శాతం వరకు జీతాలను పెంచినట్లు సమాచారం. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు A+ కేటగిరీలో చేర్చి, 10 శాతం నుంచి 13 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది. తక్కువ రేటింగ్ పొందిన వారికి కేవలం 2 శాతం నుంచి 3 శాతం వరకు మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, దేశంలో కొత్త లేబర్ కోడ్స్కు అనుగుణంగా కంపెనీ వేతన నిర్మాణాన్ని అమలు చేస్తున్నట్లు టీసీఎస్ చెబుతోంది.
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
కొంత మంది ఉద్యోగులకు నెలవారీ వేరియబుల్ పే తగ్గినట్లు తెలుస్తోంది. కొందరికి త్రైమాసిక లేదా వార్షిక జీతం మారింది. గ్రుచ్యుటీ కూడా సీటీసీలో కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కొత్త విధానంలో వేరియబుల్ పేను రెండు భాగాలుగా విభజించినట్లు సమాచారం. మంత్లీ పర్ఫామెన్స్ పే, పర్ఫామెన్స్ బోనస్ రూపంలో క్వార్టర్లీకి బదులుగా వార్షికంగా చెల్లించే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ రెండు అంశాల్లో కోత పడితే టేక్ హోం సాలరీ తగ్గుతుంది. మరోవైపు, మేనేజర్లు ఎక్కువ మంది ఉద్యోగుల్ని తక్కువ పనితీరు కేటగిరి ‘‘Band D’’లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఉన్న ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రతపై ప్రభావం ఉండొచ్చని భయం మొదలైంది.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!