Tata: ఈవీ బ్యాటరీ రంగంలోకి టాటా.. రూ. 13,000 కోట్లతో ప్లాంట్ నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata: ప్రపంచం ఎలక్ట్రానిక్ వాహనాల వైపు ప్రయాణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ)లకు డిమాండ్ పెరిగింది. కర్భణ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్న భారత ప్రభుత్వం, ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఈవీ పరిశ్రమకు అత్యంత కీలమైన లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో భారత్ ఇప్పటికీ చైనా, అమెరికాల కన్నా వెనకబడే ఉంది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లిథియం నిల్వలు బయటపడటంతో రానున్న కాలంలో భారత్ లిథియం ఉత్పత్తితో పాటు లిథియం అయాన్ బ్యాటరీలో తయారీలో ఆత్మనిర్భర్ గా మారే అవకాశం ఏర్పడింది.
Read Also: Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం..బస్సును ఢీ కొట్టిన కారు.. ఐదుగురు మృతి..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
ఇదిలా ఉంటే దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా లిథియం బ్యాటరీ తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఈవీ బ్యాటరీల తయారీ కోసం గుజరాత్ ప్రభుత్వంతో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి గిగా ప్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాదాపుగా రూ. 13,000 కోట్లతో టాటా గ్రూప్ కు అనుబంధంగా ఉన్న టాటా అగరాటాస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టనుంది. దీని వల్ల 13,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనుంది. 20 గిగావాట్ అవర్స్ ఉత్పత్తి కలిగి ఉండే ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ ప్లాంట్ ను స్థాపించడానికి శుక్రవారం ఎంఓయూపై సంతకం చేసింది.
2070 నాటికి ప్రపంచంలో అత్యథిక జనాభా కలిగిన భారత దేశాన్ని కార్బన్ నెట్ జోరోగా మార్చేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. టాటా ప్లాంట్ గుజరాత్ను లిథియం-బ్యాటరీ తయారీలో అగ్రగామిగా మారుస్తుందని రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. అయితే దీనిపై టాటా గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటా గ్రూప్ తన యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటన్లో ప్రధాన EV బ్యాటరీ ప్లాంట్ను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!