N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
- ప్రస్తుత పదవీకాలం తర్వాత టాటా సన్స్ చైర్మన్గా పునర్నియామకం కోరుకోవడం లేదని స్పష్టం
- 2027 ఫిబ్రవరి 20 వరకు ప్రస్తుత చైర్మన్గా ..
- చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
N Chandrasekaran: టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి చైర్మన్గా నియమితులయ్యేందుకు తాను ఆసక్తి చూపడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే 2027 ఫిబ్రవరి 20 వరకు ప్రస్తుత పదవీకాలంలో కొనసాగుతానని వెల్లడించారు. దీంతో టాటా గ్రూప్ తదుపరి చైర్మన్ ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.
చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్లో చేరారు. 2009లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2017లో టాటా సన్స్ చైర్మన్గా నియమితులయ్యారు. ప్రస్తుతం టాటా సన్స్ ఆధ్వర్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, ఎయిర్ ఇండియా సహా 30కి పైగా కంపెనీలు ఉన్నాయి. చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఆ తర్వాత మరో ఐదేళ్ల కాలానికి ఆయనను కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్లు ఏకగ్రీవంగా సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనను టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, బోర్డు కూడా పరిశీలించి సిఫారసు చేశాయి.
Also Read
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
అయితే ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఒక బోర్డు సభ్యుడు మద్దతు ఇవ్వకపోవడంతో నిర్ణయం ముందుకు సాగలేదు. అప్పటి నుంచి ఆరు నెలలు గడిచినా దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని పరిస్థితిలో పునర్నియామకంపై నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా సన్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పలు కీలక వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నందున నాయకత్వంపై ముందుగానే స్పష్టత ఉండటం అవసరమని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకం కోసం తన పేరును ప్రతిపాదించకూడదని నిర్ణయించుకున్నట్లు టాటా సన్స్ బోర్డుకు చంద్రశేఖరన్ తెలియజేశారు. అలాగే తన వారసుడిని వీలైనంత త్వరగా ఎంపిక చేసి, నాయకత్వ మార్పు సజావుగా జరిగేలా చూడాలని బోర్డును కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. టాటా సన్స్లో 66% వాటా టాటా ట్రస్ట్స్దే. టాటా గ్రూప్లోని కీలక కంపెనీలపై టాటా సన్స్ నియంత్రణ కలిగి ఉంది.
చంద్రశేఖరన్ 40 ఏళ్లుగా టాటా గ్రూప్తో అనుబంధం కలిగి ఉన్నారు. 2017లో టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2027 ఫిబ్రవరిలో ప్రస్తుత పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత వైదొలగనున్నారు.
తాజావార్తలు
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?