Site icon NTV Telugu

Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు

Stockmarket

Stockmarket

హమ్మయ్య.. 40 రోజుల తర్వాత పశ్చిమాసియా శాంతించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి. బుధవారం మన మార్కెట్ కూడా భారీ లాభాలతో బోణీ కొట్టింది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో దూసుకెళ్తున్నాయి. పైగా బుధవారం ఆర్బీఐ పాలసీ వెల్లడించనుంది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు మంచి జోష్ వచ్చినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.

ప్రారంభంలో సెన్సెక్స్ 2,586 పాయింట్ల లాభపడి 77, 203 దగ్గర కొనసాగగా.. ప్రస్తుతం 2,605 పాయింట్ల లాభంతో 77,265 దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 781 పాయింట్లు లాభపడి 23, 905 దగ్గర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న ఇన్వెస్టర్లు.. ఒక్క దెబ్బతో లక్షల కోట్ల సంపద జేబుల్లోకి వచ్చి పడింది.

Exit mobile version