Stock Market: మార్కెట్కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు
- దేశీయ స్టాక్ మార్కెట్కు ట్రంప్ జోష్
- భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు
- 40 రోజుల తర్వాత శాంతించిన పశ్చిమాసియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. 40 రోజుల తర్వాత పశ్చిమాసియా శాంతించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంది. ప్రస్తుతం భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఇరాన్తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి. బుధవారం మన మార్కెట్ కూడా భారీ లాభాలతో బోణీ కొట్టింది. అన్ని రంగాల సూచీలు గ్రీన్లో దూసుకెళ్తున్నాయి. పైగా బుధవారం ఆర్బీఐ పాలసీ వెల్లడించనుంది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్కు మంచి జోష్ వచ్చినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
ప్రారంభంలో సెన్సెక్స్ 2,586 పాయింట్ల లాభపడి 77, 203 దగ్గర కొనసాగగా.. ప్రస్తుతం 2,605 పాయింట్ల లాభంతో 77,265 దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 781 పాయింట్లు లాభపడి 23, 905 దగ్గర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న ఇన్వెస్టర్లు.. ఒక్క దెబ్బతో లక్షల కోట్ల సంపద జేబుల్లోకి వచ్చి పడింది.
Also Read
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
ఇది కూడా చదవండి: Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలక నేతలంతా చనిపోయారు. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కొంది. తాజాగా ట్రంప్ సీజ్పైర్ వ్యాఖ్యలతో మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!