Site icon NTV Telugu

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు కారణంగా గురువారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ లాభాల్లో కొనసాగాయి. బడ్జెట్‌కు ముందు ఇన్వెస్టర్లలో నూతనోత్సహం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ముగింపులో సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 76, 759 దగ్గర ముగియగా.. నిఫ్టీ 86 పాయింట్లు లాభపడి 23, 249 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.62 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాకు నిధులు ఆపేసిన ట్రంప్.. మహ్మద్ యూనస్‌తో ‘‘జార్జ్ సోరోస్’’ కుమారుడు భేటీ..

నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్ప్ ప్రధాన లాభాలను అర్జించగా… టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. రంగాల వారిగా ఆటో, ఐటీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.4-2 శాతం మధ్య క్షీణించగా.. ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఫార్మా, ఎనర్జీ, పీఎస్‌యూ, పీఎంసీజీ, రియాల్టీ 0.5-1 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: MP Prasada Rao: రాష్టానికి ఏమీ అడిగినా కేంద్రం సహకరిస్తుంది..

Exit mobile version