Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: సోమవారం నాటి జోరును చూసి మంగళవారం కూడా లాభాలు వస్తాయని ఆశించిన ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ గట్టి షాక్ ఇచ్చింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు, కేవలం రెండు గంటల వ్యవధిలోనే కుప్పకూలాయి. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి సెన్సెక్స్ తన గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 600 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ ఊహించని పరిణామంతో ఇన్వెస్టర్లు సుమారు రూ.3.74 లక్షల కోట్ల మేర లాస్ అయ్యారు.
మార్కెట్ గమనం ఇలా..
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 77,094 పాయింట్ల వద్ద స్వల్పంగా నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, 10:30 గంటల సమయానికి పుంజుకుని 77,493 పాయింట్ల వద్ద డే-హైని తాకింది. అయితే అక్కడి నుంచి అమ్మకాల ఒత్తిడి మొదలైంది. మధ్యాహ్నం 12:30 గంటలకల్లా 76,876 పాయింట్ల వద్ద డే-లోకి పడిపోయింది. అంటే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 616 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 24,181 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23,992 కనిష్ట స్థాయికి పడిపోయింది.
Also Read
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
బ్యాంకింగ్ ఆస్తుల వర్గీకరణ, కేటాయింపులపై ఆర్బీఐ కొత్త నిబంధనలు (ECL) తీసుకురావడంతో బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2 శాతం మేర పతనమయ్యాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్కు 109.3 డాలర్లకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. ఎఫ్ఐఐలు (FIIs) సోమవారం ఒక్కరోజే రూ.1,151.48 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్పై ఒత్తిడి తెచ్చింది.
గత వారం నష్టాల తర్వాత సోమవారం ఐటీ స్టాక్స్ పెరగడంతో, చాలామంది ఇన్వెస్టర్లు ఈరోజు లాభాలను వెనక్కి తీసుకోవడానికి ఆసక్తి చూపారు. జపాన్, హాంకాంగ్ సహా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటం, యూఎస్ ఫ్యూచర్స్ కూడా బలహీనంగా ఉండటం ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. నిఫ్టీ గడువు ముగిసే రోజు కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను సర్దుబాటు చేసుకోవడం వల్ల ఇంట్రా-డేలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల అనిశ్చితి, దౌత్య చర్చల రద్దు వంటి అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇన్వెస్టర్లను భయపెట్టాయి. ప్రస్తుతానికి మార్కెట్ అస్థిరంగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు మార్కెట్ను బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ రంగాలు నష్టాల వైపు నడిపించాయని, సన్ ఫార్మా, రిలయన్స్ వంటి షేర్లు మాత్రమే కొంతమేర సూచీలను ఆదుకున్నాయని విశ్లేషకులు చెప్పారు.
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!