Stock Market Crash: గల్ఫ్ ‘టెన్షన్’.. మార్కెట్ ‘డిప్రెషన్’.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్తో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన సూచీలు, మంగళవారం ట్రేడింగ్ స్టార్టింగ్లోనే కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.
మంగళవారం ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది. సోమవారం క్లోజింగ్ 77,269తో పోలిస్తే, ఈ రోజు 77,103 వద్ద స్టార్ట్ అయ్యి, కొద్దిసేపటికే 76,745 స్థాయికి పడిపోయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 24,052 వద్ద ప్రారంభమై, అమ్మకాల ఒత్తిడితో 24,000 మార్కు దిగువకు చేరింది.
Also Read
- FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
- Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
అమెరికా యుద్ధనౌకపై క్షిపణి దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం, తన చమురు ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని యూఏఈ ఆరోపించడంతో గల్ఫ్ రీజియన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $114కి చేరుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలపై డోనాల్డ్ ట్రంప్ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది.
అతిపెద్ద నష్టాలను చవిచూసిన స్టాక్లు..
స్టాక్ మార్కెట్ పతనం మధ్య అతిపెద్ద నష్టాలను చవిచూసిన స్టాక్ల విషయానికి వస్తే.. బీఎస్ఈ లార్జ్క్యాప్ కంపెనీలలో, బజాజ్ ఫైనాన్స్ షేర్ 1.50% క్షీణతతో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్ 1.30% క్షీణతతో, ఎల్టీ షేర్ 1.25% క్షీణతతో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి కాకుండా మిడ్క్యాప్ కంపెనీలలో, వోల్టాస్ షేర్ (3%), ముతూట్ ఫైనాన్స్ షేర్ (2.60%), గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్ (2.45%), జీఎంఆర్ ఎయిర్పోర్ట్ షేర్ (2.20%) లాస్లో ట్రేడ్ అవుతున్నాయి. స్మాల్క్యాప్ కేటగిరీలోని కంపెనీలను పరిశీలిస్తే.. సింగ్నే షేర్ (3%), మణప్పురం షేర్ (2.50%), ఏఐఐఎల్ షేర్ (1.92%) నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం నాటి భారీ లాభాలు ఒక్కపూటలో ఆవిరి కావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మార్కెట్ మరిన్ని కనిష్ట స్థాయిలను తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం అమెరికా రక్షణ వర్గాల నుంచి రాబోయే ప్రకటన మార్కెట్ దిశను నిర్ణయించనుందని సమాచారం.
తాజావార్తలు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!