Stock Market Crash: గల్ఫ్ ‘టెన్షన్’.. మార్కెట్ ‘డిప్రెషన్’.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్తో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన సూచీలు, మంగళవారం ట్రేడింగ్ స్టార్టింగ్లోనే కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.
మంగళవారం ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది. సోమవారం క్లోజింగ్ 77,269తో పోలిస్తే, ఈ రోజు 77,103 వద్ద స్టార్ట్ అయ్యి, కొద్దిసేపటికే 76,745 స్థాయికి పడిపోయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 24,052 వద్ద ప్రారంభమై, అమ్మకాల ఒత్తిడితో 24,000 మార్కు దిగువకు చేరింది.
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
- Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
అమెరికా యుద్ధనౌకపై క్షిపణి దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం, తన చమురు ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని యూఏఈ ఆరోపించడంతో గల్ఫ్ రీజియన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $114కి చేరుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలపై డోనాల్డ్ ట్రంప్ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది.
అతిపెద్ద నష్టాలను చవిచూసిన స్టాక్లు..
స్టాక్ మార్కెట్ పతనం మధ్య అతిపెద్ద నష్టాలను చవిచూసిన స్టాక్ల విషయానికి వస్తే.. బీఎస్ఈ లార్జ్క్యాప్ కంపెనీలలో, బజాజ్ ఫైనాన్స్ షేర్ 1.50% క్షీణతతో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్ 1.30% క్షీణతతో, ఎల్టీ షేర్ 1.25% క్షీణతతో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి కాకుండా మిడ్క్యాప్ కంపెనీలలో, వోల్టాస్ షేర్ (3%), ముతూట్ ఫైనాన్స్ షేర్ (2.60%), గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్ (2.45%), జీఎంఆర్ ఎయిర్పోర్ట్ షేర్ (2.20%) లాస్లో ట్రేడ్ అవుతున్నాయి. స్మాల్క్యాప్ కేటగిరీలోని కంపెనీలను పరిశీలిస్తే.. సింగ్నే షేర్ (3%), మణప్పురం షేర్ (2.50%), ఏఐఐఎల్ షేర్ (1.92%) నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం నాటి భారీ లాభాలు ఒక్కపూటలో ఆవిరి కావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మార్కెట్ మరిన్ని కనిష్ట స్థాయిలను తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం అమెరికా రక్షణ వర్గాల నుంచి రాబోయే ప్రకటన మార్కెట్ దిశను నిర్ణయించనుందని సమాచారం.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?