NTV Telugu Site icon

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా అలాగే కొనసాగి ముగిశాయి. సెన్సెక్స్ 99 పాయింట్లు లాభపడి 81,455 దగ్గర ముగియగా.. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 24, 857 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.73 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Ravinder Chandrasekar: సినీ నిర్మాత ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆకస్మిక దాడులు

నిఫ్టీలో బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఏషియన్ పెయింట్స్ లాభపడగా.. సిప్లా, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు పవర్, రియాల్టీ మరియు ఆటో 0.5-1 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి.

ఇది కూడా చదవండి: Crime News: ప్రేమ వద్దు అన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య