Gautam Adani: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. అదానీకి సెబీ క్లీన్చిట్..
- అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఆరోపణలు..
- ఆర్థిక అవకతవకలు జరగలేదని సెబీ క్లీన్చిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ , అదానీ పవర్ వంటి అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తోసిపుచ్చింది. జనవరి 2023లో, అదానీ గ్రూప్ సంస్థల మధ్య డబ్బుల్ని మళ్లించడానికి అడికార్ప్ ఎంటర్ప్రైజెస్, మైల్స్టోన్ ట్రేడ్లింక్స్, రెహ్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కంపెనీలను ఉపయోగించుకుందని హిండెన్బర్గ్ ఆరోపించింది.
Read Also: Singareni : అధికారుల నిర్లక్ష్యం.. సింగరేణిలో మరో ప్రమాదం
Also Read
- Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
అయితే, ఈ ఆరోపణల్ని విచారించిన సెబీ, అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లోకి అక్రమంగా నిధులు మళ్లించినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులు వెలువరించింది. అదానీ గ్రూప్ కంపెనీ లావాదేవీల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని సెబీ బోర్డు సభ్యుడు కమెలేష్ సీ వార్ష్నీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెట్టుబడిదారుల్ని తప్పుదోవ పట్టించేలా ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని చెప్పింది. అదానీ గ్రూపుపై ఎలాంటి జరిమానా విధించాల్సిన అవసరం లేదని తెలిపింది.
హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 150 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయారు. సెబీ క్లీన్చిట్కు ముందు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా అదానీ గ్రూప్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. దీంతో మళ్లీ షేర్లు పుంజుకున్నాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!