Jio Rs 209 Plan: జియో యూజర్స్కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Rs 209 Plan: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించే తన రూ.209 రీఛార్జ్ ప్లాన్ను సైలెంట్గా తొలగించింది. ఇప్పటివరకు మైజియో (MyJio) యాప్లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు కనిపించడం లేదు.
ట్రాయ్ ఆదేశాలే కారణమా..
టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఆదేశాల మేరకే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ల వివరాల్లో పారదర్శకత లోపించిన కొన్ని ప్లాన్లను నిలిపివేయాలని ట్రాయ్ సూచించడంతో, జియో ఈ చౌక ప్లాన్ను ప్లాట్ఫామ్ నుంచి తొలగించినట్లు సమాచారం.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
రూ.209 ప్లాన్ ప్రయోజనాలు ఇవే..
ఈ ప్లాన్ ద్వారా యూజర్స్ పొందిన బెనిఫిట్స్ ఒకసారి చూస్తే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులు ఉండేది. రోజుకు 1GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, దేశవ్యాప్తంగా ఏదైనా నెట్వర్క్కు అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉండేది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ (SMS) చేసే సౌలభ్యం కూడా ఉండేది. దీనికి అదనపు ప్రయోజనాలుగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ (JioAI Cloud) వంటి సేవలకు ఉచిత యాక్సెస్ ఉండేది. తక్కువ బడ్జెట్లో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో యూజ్పుల్గా పని చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో, దీని స్థానంలో జియో ఏ ప్లాన్ను తీసుకువస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!