RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తోందని ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ మార్పులు చోటుచేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
5 శాతానికి చేరనున్న ద్రవ్యోల్బణం..
ఐసీఐసీఐ బ్యాంక్ విశ్లేషణ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్రవ్యోల్బణం 5 శాతానికి చేరే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార వస్తువుల ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్బీఐ సాధారణంగా వడ్డీ రేట్లను పెంచుతుంది.
Also Read
- Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
- Gen Z Lifestyle: 'జెన్ జీ' లైఫ్స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
- Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
- AMCA Deal: ఇండియన్ డిఫెన్స్లో గేమ్చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
ప్రస్తుతం 5.25 శాతం వద్ద రెపో రేటు..
ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.25 శాతం వద్ద కొనసాగుతోంది. ఒకవేళ ఐసీఐసీఐ బ్యాంక్ అంచనాలే నిజమైతే, 50-75 బేసిస్ పాయింట్ల పెంపుతో రెపో రేటు 5.75 శాతం నుంచి 6.00 శాతానికి చేరే ప్రమాదం ఉంది. గత కొన్ని త్రైమాసికాలుగా ఆర్బీఐ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ.. మారుతున్న ఆర్థిక సమీకరణాల దృష్ట్యా రానున్న ద్రవ్య పరపతి సమీక్షల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సామాన్యులపై పడే ప్రభావం..
ఆర్బీఐ గనుక రెపో రేటును పెంచితే, వాణిజ్య బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. దీనివల్ల.. ఇంటి రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న సామాన్యుల నెలవారీ ఈఎంఐలు భారీగా పెరుగుతాయి. అంతే కాకుండా.. కొత్తగా లోన్లు తీసుకోవాలనుకునే వారికి వడ్డీ భారం మరింత అధికమవుతుంది. రేట్ల పెంపుతో ఫిక్స్డ్ డిపాజిట్లపై (FDs) వచ్చే వడ్డీ రేట్లు పెరిగి, సీనియర్ సిటిజన్లకు కొంత ఉపశమనం లభిస్తుంది. రాబోయే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశీయ మార్కెట్ గమనాన్ని బట్టి ఆర్బీఐ తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
-
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?