New Railway Lines: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి.. ఈ ప్రాంతాల మధ్యనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రాజమండ్రి – విశాఖపట్నం రైల్వే మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఇది నిజంగా తీపి కబురు. గత దశాబ్ద కాలంగా పెరుగుతున్న రద్దీ వల్ల రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవడం, క్రాసింగ్ల కోసం వేచి చూడటం ప్రయాణికులకు నిత్యం నరకంగా మారింది. అయితే.. కేంద్ర కేబినెట్ రూ. 9,889 కోట్ల భారీ బడ్జెట్తో 3, నాల్గవ లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఈ రెండు నగరాల మధ్య తిరిగే సామాన్యులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ప్రయాణం కేవలం గమ్యానికి చేరడమే కాకుండా, ఎంతో సౌకర్యవంతంగా మరియు సంతోషదాయకంగా మారనుంది.
రైల్వే శాఖ ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను సమూలంగా మార్చనుంది. రాజమండ్రి నుంచి విశాఖపట్నం (దువ్వాడ) వరకు ఉన్న సుమారు 150-180 కిలోమీటర్ల మేర మూడవ, నాల్గవ రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 9,889 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Also Read
- GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
- Jio Annual Plan: జియో వార్షిక ప్లాన్తో అదిరిపోయే ఆఫర్.. అన్లిమిటెడ్ 5జీతో పాటు AI, OTT సబ్స్క్రిప్షన్లు ఉచితం
- LPG Cylinder Price Cut: ఆగస్టు మొదటి రోజే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
Also Read:Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..
ప్రస్తుతం ఉన్న లైన్లపై విపరీతమైన లోడ్ ఉంది. ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్ల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక్కడ మూడు, నాల్గవ లైన్లు అందుబాటులోకి వస్తే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గం సుగమమై.. ఎక్స్ప్రెస్ రైళ్లు వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది.
విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ , కాకినాడ సెజ్ నుంచి వచ్చే సరుకు రవాణాకు ఈ అదనపు లైన్ వెన్నెముకగా నిలుస్తుంది. ఇది ప్రయాణికులకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్నిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మధ్యలో ఉన్న ప్రధాన స్టేషన్లను ఆధునీకరించడం, వంతెనల నిర్మాణం, సిగ్నలింగ్ వ్యవస్థను అప్గ్రేడ్ చేయడం వంటి పనులు కూడా చేపడతారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
-
Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
-
Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!