New Railway Lines: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి.. ఈ ప్రాంతాల మధ్యనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రాజమండ్రి – విశాఖపట్నం రైల్వే మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఇది నిజంగా తీపి కబురు. గత దశాబ్ద కాలంగా పెరుగుతున్న రద్దీ వల్ల రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవడం, క్రాసింగ్ల కోసం వేచి చూడటం ప్రయాణికులకు నిత్యం నరకంగా మారింది. అయితే.. కేంద్ర కేబినెట్ రూ. 9,889 కోట్ల భారీ బడ్జెట్తో 3, నాల్గవ లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఈ రెండు నగరాల మధ్య తిరిగే సామాన్యులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ప్రయాణం కేవలం గమ్యానికి చేరడమే కాకుండా, ఎంతో సౌకర్యవంతంగా మరియు సంతోషదాయకంగా మారనుంది.
రైల్వే శాఖ ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్టు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను సమూలంగా మార్చనుంది. రాజమండ్రి నుంచి విశాఖపట్నం (దువ్వాడ) వరకు ఉన్న సుమారు 150-180 కిలోమీటర్ల మేర మూడవ, నాల్గవ రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 9,889 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Also Read
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
Also Read:Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..
ప్రస్తుతం ఉన్న లైన్లపై విపరీతమైన లోడ్ ఉంది. ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్ల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక్కడ మూడు, నాల్గవ లైన్లు అందుబాటులోకి వస్తే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గం సుగమమై.. ఎక్స్ప్రెస్ రైళ్లు వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది.
విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ , కాకినాడ సెజ్ నుంచి వచ్చే సరుకు రవాణాకు ఈ అదనపు లైన్ వెన్నెముకగా నిలుస్తుంది. ఇది ప్రయాణికులకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్నిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మధ్యలో ఉన్న ప్రధాన స్టేషన్లను ఆధునీకరించడం, వంతెనల నిర్మాణం, సిగ్నలింగ్ వ్యవస్థను అప్గ్రేడ్ చేయడం వంటి పనులు కూడా చేపడతారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..