Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫారసు లేఖల కలకలం..
- ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్న వైనం..
- అత్తిలిలో పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు పక్కదారి పడుతున్నారు. సామాన్య ప్రజల నమ్మకాన్ని, నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని నకిలీ సిఫారసు లేఖల దందాను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి, డిప్యూటీ సీఎం సంతకాన్ని, లెటర్ హెడ్లను ఫోర్జరీ చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి మోసపూరిత చర్యలు వ్యక్తులకు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి నియోజకవర్గ పరిధిలో ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నకిలీ లేఖల సృష్టి..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి జారీ అయినట్లుగా నకిలీ సిఫారసు లేఖలను అక్రమార్కులు సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు ఈ లేఖలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ విషయం పార్టీ దృష్టికి వెళ్లడంతో అత్తిలికి చెందిన జనసేన నాయకులు వెంటనే అప్రమత్తమయ్యారు. పవన్ కళ్యాణ్ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసు స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
Also Read
- PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- 144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read:Central Govt: ఎట్టకేలకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం..
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ లేఖలు ఎక్కడ తయారయ్యాయి? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో టెక్నికల్ టీమ్ సాయంతో సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కేవలం అధికారిక నోటిఫికేషన్లు, పరీక్షల ద్వారానే జరుగుతుందని.. ఎవరైనా సిఫారసు లేఖల పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
-
Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
-
Mutual Funds: ఆదాయం తక్కువగా ఉందని బాధపడుతున్నారా? ఈ పెట్టుబడితో ధనవంతులైపోవచ్చు..!
-
China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!