గ్యాస్, పెట్రో ధరలకు ఇలా కళ్లెం వేద్దాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావం కేంద్రంపైనా పడుతోంది. 2020-21లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 85 డాలర్లకు చేరడంతో … దేశం క్రూడాయిల్ దిగుమతి బిల్ ఏకంగా మూడు రెట్ల పెరిగింది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి పెంచడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ .. 30 ప్రపంచ ఆయిల్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వర్చువల్ పద్ధతిలో భేటీ అయ్యారు. దేశీయంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కోరారు. ఏడేళ్లుగా ఇంధన రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
ఆయిల్ వేట, లైసెన్స్ పాలసీలు, గ్యాస్ మార్కెటింగ్, కోల్ బెడ్ మీథేన్, కోల్ గ్యాసిఫికేషన్ తదితర అంశాల పైనా చర్చ జరిగింది. ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా ఇంధనరంగంలో స్వయం సమృద్ధి సాధించే వరకూ ఈ సంస్కరణలు కొనసాగుతాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయిల్ సెక్టార్ పై చర్చ సందర్భంగా.. లాభాలు ఆర్జించడం పైనుంచి అధిక ఉత్పత్తిని సాదించడంపై ఫోకస్ పెట్టాలని ప్రధాని.. సీఈవోలకు సూచించారు. దీనితో పాటు క్రూడాయిల్ స్టోరేజ్ వసతులపైనా చర్చించారు. దేశంలో అనూహ్యంగా పెరిగిన నేచురల్ గ్యాస్ డిమాండ్ను చర్చించారు. ఈ సమావేశానికి దేశీయ ఇంధన దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
Also Read
- Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!