Fuel Prices Hiked: వరుసగా రెండోరోజూ పెట్రో మంట.. కొత్త రేట్లు ఇవిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి.. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలపాటు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు.. మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభిం,చాయి.. వరుసగా రెండో రోజు లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు వడ్డించాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.01కు చేరగా.. డీజిల్ ధర రూ.88.27కు పెరిగింది.. మూడు ప్రభుత్వరంగ ఇంధన రిటైలర్లు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్.. భారతదేశంలో ఇంధన రిటైలింగ్లో ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే కాగా.. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ధరలను పెంచడానికే మొగ్గు చూపుతున్నాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
తాజా వడ్డింపులతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.21 నుండి రూ.97.01కి, డీజిల్ ధర రూ.86.67 నుంచి రూ.88.27కి పెరిగాయి.. ఇక, ముంబైలో, పెట్రోల్ ధర లీటరుకు రూ.111.67కి, డీజిల్ లీటర్కు రూ.95.85కి పెరిగింది. కోల్కతా మరియు చెన్నైలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా రూ.106.34 మరియు రూ.91.42, చెన్నైలో రూ.102.91 మరియు రూ.92.95 చేరింది.. మరోవైపు బెంగళూరులో పెట్రోల్ ధర రూ.102.26గా, డీజిల్ రూ.86.58కి చేరింది. హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరగా.. ఏపీలో లీటర్ పెట్రోల్పై 87పైసలు, డీజిల్పై 84 పైసలు పెరగడంతో.. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.08, డీజిల్ రూ.98.10కి ఎగబాకింది. దేశవ్యాప్తంగా రిటైల్ ధరలను తగ్గించేందుకు గత ఏడాది నవంబర్ 3న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున తగ్గించింది.. ఇక, కేంద్రం బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా పెరుగుదలకు బ్రేక్ పడింది.. ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోవడం.. అంతర్జాతీయ చమురు ధరలు ఈ సంవత్సరం మళ్లీ పెరగడంతో మళ్లీ వడ్డింపులు ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!