Petrol and Diesel Prices: ఎన్నికల ముందు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనాదారులకు ఉపశమనం కలిగిస్తూ.. ఈ ఏడాది మే నెలలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది కేంద్రం.. లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.. ఇది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామం.. అంతేకాదు.. త దీపావళి అనంతరం పెట్రో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. అప్పట్లో కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.10 చొప్పున తగ్గించింది. అంతుకు ముందు.. లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.10 చొప్పున తగ్గించిన విషయం విదితమే.. అయితే, మరోసారి భారీగా పెట్రో ధరలు తగ్గుతాయనే చర్చ సాగుతోంది.. ఈ సారి పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ. 2 వరకు తగ్గింపు ఉండవచ్చు అనే ప్రచారం సాగుతోంది..
Read Also: YS Jagan Mohan Reddy: టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలపై సీఎం జగన్ ఫోకస్
Also Read
- Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
అయితే, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. భారత్లోనూ ఈ మధ్య పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకున్నది కూడా లేదు.. అయితే, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి తగ్గించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. ఈ నెల 1వ తేదీన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయనే ప్రచారం జరిగింది.. కానీ, అలాంటి నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు.. మరోవైపు, సోమవారం రాత్రి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. డీలర్లకు ధరల తగ్గింపుపై నోటిఫై చేసిందని, మళ్లీ మంగళవారం ఉదయం నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఇక, మంగళవారం, బుధవారం రోజుల్లో కూడా ఎలాంటి మార్పులు కనిపించలేదు.. కానీ, త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే ప్రచారం మాత్రం సాగుతోంది.. మరోవైపు.. కరోనా మహమ్మారి తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో.. క్రమంగా భారత్లో పెట్రోల్, డీజిల్ డిమాండ్ పెరిగిపోతోంది.. ఇదిలా ఉండగా, దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా కొనసాగుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27. చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94 కాగా, డీజిల్ ధర రూ.87.89గా ఉంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో