EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO New Rules: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులకు మరింత సౌకర్యాన్ని కల్పించే దిశగా కీలక మార్పులను ప్రకటించింది. ముఖ్యంగా PF క్లెయిమ్లు, విత్డ్రాయల్స్కు సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సభ్యులు తమ PF ఖాతాలోని 100 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం పొందనున్నారు. గతంలో పూర్తి PF మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే సభ్యులు కారణాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు సంబంధిత పత్రాలను కూడా సమర్పించాల్సి వచ్చేది. నిరుద్యోగం, కంపెనీ మూసివేత, ప్రకృతి వైపరీత్యాలు, లాక్డౌన్ వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పూర్తి ఉపసంహరణకు అనుమతి ఉండేది. అయితే కారణాలు EPFO నిబంధనలకు అనుగుణంగా లేకపోతే క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి.
100 శాతం PF విత్డ్రా ఎప్పుడు సాధ్యం?
ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పూర్తి PF మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఒక సంస్థ 15 రోజుల కంటే ఎక్కువ కాలం లాక్డౌన్లో ఉండటం, మూతపడటం వల్ల ఉద్యోగులు నిరుద్యోగులుగా మారడం, లేదా రెండు నెలలకుపైగా జీతాలు చెల్లించకపోవడం వంటి సందర్భాల్లో ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే ఉద్యోగం నుంచి తొలగించబడిన లేదా ఉద్యోగ కోతకు గురైన ఉద్యోగులు, ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసినట్లయితే కూడా పూర్తి ఉపసంహరణకు అర్హులవుతారు. సంస్థ ఆరు నెలలకుపైగా మూతపడి ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉన్నా ఈ నిబంధన వర్తిస్తుంది. కుటుంబ సభ్యుల లేదా సభ్యుని వైద్య చికిత్స కోసం కూడా 100 శాతం PF మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
Also Read
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
కొత్త నిబంధనల్లో ఏమి మారింది?
2025 అక్టోబర్ 13న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రత్యేక పరిస్థితుల కేటగిరీలో PF విత్డ్రా కోసం సభ్యులు కారణాన్ని వివరించాల్సిన నిబంధనను EPFO తొలగించింది. గతంలో కారణాలను సమర్పించడంలో ఏర్పడే సాంకేతిక సమస్యలు, క్లెయిమ్ తిరస్కరణలు, ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అర్హత ఉన్న సభ్యులు అదనపు వివరణ ఇవ్వకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం పొందుతున్నారు.
సాధారణ పరిస్థితుల్లో ఎంత వరకు విత్డ్రా చేసుకోవచ్చు?
కొత్త సడలింపులు వచ్చినప్పటికీ, సాధారణ పరిస్థితుల్లో మొత్తం PF బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి లేదు. EPFO నిబంధనల ప్రకారం అర్హత ఉన్న మొత్తంలో 75 శాతం వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అక్టోబర్ 15, 2025న విడుదల చేసిన మరో మార్గదర్శకం ప్రకారం, ఈ 75 శాతం వరకు ఉపసంహరణకు ప్రత్యేక డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. EPFO తీసుకొచ్చిన ఈ సంస్కరణలతో క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగవంతం కావడంతో పాటు, సభ్యులకు తమ పొదుపులపై మరింత నియంత్రణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే క్లెయిమ్ తిరస్కరణలు తగ్గి, సేవల పారదర్శకత కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!