Paytm Net Loss: పేటీఎంకి పెరిగిన నష్టం. షుగర్ మిల్లులకు ‘తీపి’ కబురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paytm Net Loss: జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో పేటీఎం నికర నష్టం మరింత పెరిగింది. గతేడాది 380 కోట్ల రూపాయలు నష్టం రాగా అది ఈసారి 644 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయం 89 శాతం పెరిగి 16 వందల 80 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్ నాటికి వచ్చిన రెవెన్యూ 891 కోట్లు మాత్రమేనని సంస్థ వెల్లడించింది. డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసుల రంగంలో పేరొందిన పేటీఎంకి ఆదాయం పెరిగినా నష్టాలు తగ్గలేదని దీన్నిబట్టి అర్థమవుతోంది.
‘తీపి’ కబురు
Also Read
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
- Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
పంచదార ఎగుమతులపై పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. అదనంగా 12 లక్షల టన్నులను ఎక్స్పోర్ట్ చేసేందుకు అనుమతించింది. షుగర్ మిల్లులు ఈ మార్కెటింగ్ సంవత్సరంలో ఇప్పటికే దాదాపు కోటి టన్నుల పంచదారను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశాయి. ఇది ఆల్ టైం రికార్డ్ కావటం చెప్పుకోదగ్గ విషయం. మార్కెటింగ్ ఇయర్ అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమై సెప్టెంబర్లో ముగుస్తుందనే సంగతి తెలిసిందే.
Laurus Labs Founder And CEO Dr. Satyanarayana Chava Exclusive Interview
‘నీతి ఆయోగ్’ భేటీ
రేపు ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ జరగనుంది. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. వ్యవసాయం మరియు సంబంధిత అంశాలతోపాటు ఇతరత్రా అజెండా పైనా చర్చ జరగనుంది. విదేశాల నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఏమేం చర్యలు చేపట్టాలో ఈ మీటింగ్లో చర్చిస్తారు.
ఎఫ్పీఐల కమిటీ
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. ఫారన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ఇండియాలోకి విదేశాల నుంచి నిధుల ప్రవాహాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 14 మంది సభ్యులు ఉండే ఈ అడ్వైజరీ కమిటీకి మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ సారథ్యం వహిస్తారు. విదేశీ బ్యాంకులతోపాటు స్థానిక స్టాక్ ఎక్స్ఛేంజ్ల డిపాజిటరీలు మరియు ఆర్బీఐ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఆర్బీఐ ఓకే
స్టాండలోన్ ప్రైమరీ డీలర్లు అన్ని విదేశీ మారక వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ఫారన్ ప్రైమరీ డీలర్షిప్ల నుంచి వినతులు వెల్లువెత్తడంతో ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న లైసెన్సు పరిధి పరిమితంగా ఉండటాన్ని వాళ్లు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ పూర్తి స్థాయి అనుమతులను మంజూరుచేసింది.
డీఎల్ఎఫ్ డీల్
దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్ సంస్థ.. సౌత్ ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఆంబియెన్స్ అనే ప్రముఖ షాపింగ్ మాల్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. దీనికోసం వేలం జరిగితే బిడ్ వేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ షాపింగ్ మాల్ ప్రారంభ వేలం ధరే 366 మిలియన్ డాలర్లు కావటం విశేషం.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!