OPPO Company: చైనా కంపెనీ ‘ఒప్పొ’ చూపు.. ఇండియా వైపు. రూ.475 కోట్ల పెట్టుబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Company: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పొ మన దేశంలో 475 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. విహాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. వచ్చే ఐదేళ్లలో కంపెనీ వార్షిక ఎగుమతుల సామర్థ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 5జీ లాంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీల డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ పెట్టనున్నట్లు పేర్కొంది.
5వ రోజూ ‘5జీ’ వేలం
Also Read
- Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
- Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
5జీ స్పెక్ట్రం వేలం ఇప్పటికి 4 రోజులు పూర్తయింది. ఇవాళ 5వ రోజు కూడా ఆక్షన్ జరగనుంది. నిన్న 4వ రోజు వేలంలో 231 కోట్ల రూపాయలకు పైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రంలో 71 శాతానికి అప్లికేషన్లు వచ్చాయని టెలికం శాఖ మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 17 రౌండ్ల వేలంలో లక్షా 49 వేల 855 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయని చెప్పారు.
Jail Term: శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా నాలుగేళ్లపాటు జైల్లోనే. అసలేం జరిగింది?
ఐటీఆర్లకు రేపే లాస్ట్
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లను సమర్పించేందుకు రేపు ఆదివారమే ఆఖరు తేదీ. ఈ నేపథ్యంలో గడువు పొడిగిస్తారేమోనని ఐటీ చెల్లింపుదారులు ఎదురుచూస్తున్నారు. కానీ గడువు పెంచే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో మొన్న గురువారం ఒక్క రోజే 36 లక్షలకు పైగా ఐటీఆర్లు వచ్చాయి.
తగ్గని ‘యూరో’ ద్రవ్యోల్బణం
యూరో జోన్లోని 19 దేశాల్లో వార్షిక ద్రవ్యోల్బణం ప్రతి నెలా పెరుగుతోంది. ఈ నెలలో రికార్డ్ స్థాయిలో 8.9 శాతానికి చేరింది. 1997 తర్వాత ఇదే అత్యధికం కావటం అక్కడి ప్రజలకు, పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. జూన్ నెలలో కూడా ద్రవ్యోల్బణం 8.6 శాతంగా నమోదైంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం దిగిరాకపోవటానికి ఇదే ప్రధాన కారణం.
ఓలా, ఉబర్ విలీనం!
క్యాబ్ సర్వీసుల రంగంలో టాప్లో నిలిచిన ఓలా, ఉబర్ కంపెనీలు రెండూ భవిష్యత్తులో ఒక్కటి కానున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇరు వర్గాలు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓలా వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆ సంస్థ సీఈఓ భవిశ్ అగర్వాల్ రీసెంటుగా ఉబర్ మేనేజ్మెంట్తో సమావేశమైనట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. ఓలా, ఉబర్ విలీనంపై నాలుగేళ్ల కిందట కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఫారెక్స్ నిల్వల పతనం
ఇండియాలో విదేశీ మారక నిల్వల పతనం కొనసాగుతోంది. 22వ తేదీతో ముగిసిన వారంలో 115 కోట్ల డాలర్లకు పైగా ఫారెక్స్ నిల్వలు తగ్గాయని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 57 వేల 156 కోట్ల డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు వారంలో ఫారెక్స్ నిల్వలు భారీ స్థాయిలో 754 కోట్ల డాలర్లు పడిపోయాయి.
తాజావార్తలు
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..