Jio 5G: గుడ్న్యూస్ చెప్పిన జియో.. యూజర్లకు ఇక పండగే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్లో అడుగుపెట్టిన ఈ సంస్థ.. ఆ తర్వాత.. కొత్త ప్లాన్స్ తీసుకొస్తూ.. చార్జీలు వడ్డించినా.. నెట్ స్పీడ్, నెట్వర్క్ లాంటి అంశాలు.. ఆ సంస్థకు కోట్లాది మంది యూజర్లను సంపాదించింది పెట్టింది.. ఇక, ఇప్పుడు దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణపై దృష్టిసారించిన ఆ సంస్థ.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.. భారత్లో వన్ ప్లస్ – జియోలు లేటెస్ట్ 5జీ టెక్నా లజీ నెట్వర్క్ పై కలిపి పనిచేసేలా ఒప్పందం ఎదుర్చుకున్నాయి.. 5జీ స్వతంత్ర సాంకేతికతను తీసుకురావడానికి ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి..
Read Also: MLC Kavitha : దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ఒప్పందంలో భాగంగా జియో సంస్థ.. వన్ ప్లస్కు సంబంధించిన వన్ ప్లస్ 9 ప్రో, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ఆర్టీ’తో పాటు వన్ ప్లస్ 10 ప్లస్, వన్ ప్లస్ 9 ఆర్, వన్ ప్లస్ 8 సిరీస్లోని నార్డ్, నార్డ్ 2టీ, నార్డ్ 2, నార్డ్ సీఈ, నార్డ్ సీఈ2, నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్లలో జియో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి తెచ్చే పనిలో పడిపోయాయి.. ఈ నేపథ్యంలో.. డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 18వ తేదీ వరకు వన్ప్లస్ యానివర్సరీ సేల్ ప్రకటించింది. ఈ సేల్లో అర్హులైన వన్ ప్లస్, జియో 5జీ వినియోగదారులకు రూ.10,800 క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.. అంతేకాదు.. మొదటి 1000 మంది లబ్ధిదారులు అదనంగా రూ. 1499 విలువైన రెడ్ కేబుల్ కేర్ ప్లాన్ మరియు రూ. 399 విలువైన జియో సావ్న్ ప్రో ప్లాన్ను కూడా అందిస్తారు..
ప్రస్తుతం, రిలయన్స్ జియో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణెలో 5జీ స్వతంత్రంగా సేవలను ప్రారంభిస్తోంది.. తమ “ట్రూ 5G” గుజరాత్లోని మొత్తం 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. 5జీ నెట్వర్క్ విస్తృతంగా రెండు మోడ్లలో అమలు చేస్తున్నారు.. స్వతంత్ర (ఎస్ఏ) మరియు నాన్-స్టాండలోన్ (ఎన్సీఏ). ఎన్సీఏ నెట్వర్క్ ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలపై నిర్మించబడింది, అర్హత ఉన్న సర్కిల్లలోని రిలయన్స్ జియో వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లలో 5జీని ఉచితంగా పరీక్షించవచ్చు. నమోదు చేసుకోవడానికి, వినియోగదారులు “చెల్లుబాటు అయ్యే యాక్టివ్ ప్రీపెయిడ్ (రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్) లేదా పోస్ట్పెయిడ్ ప్లాన్లో ఉన్నారని నిర్ధారించుకోవాలి. సాధారణంగా, వినియోగదారులు 5జీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే స్వయంచాలకంగా గుర్తించాలి. లేదంటే, యాప్ ఎగువన వెల్కమ్ ఆఫర్ కోసం మై జియో యాప్ని సందర్శించాలి..
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!