Drugs Smuggling: ‘పుష్ప’ సీన్ను మించి.. పెళ్లి బట్టల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎర్రచందనం స్మగ్లింగ్ను కళ్లకు కట్టినట్టు ‘పుష్ప’ సినిమాలో చూపించారు.. పాల వ్యాన్, ఇతర మార్గాల్లో ఎలా ఎర్రచందనాన్ని సైడ్ చేయొచ్చో తెరపైకి ఎక్కించారు.. ఆ తర్వాత ఈ తరహా స్మగ్లింగ్లు ఎన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ స్మగ్లింగ్ బయటపడింది.. కొత్త తరహాలో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు.. పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది.. చెన్నైకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.. 15 కిలోల మత్తు మందు ఎపిడ్రిన్ స్వాధీనం చేస్తున్నారు.. చెన్నై నుంచి హైదరాబాద్ పెళ్లి వస్త్రాలు తెస్తున్నట్లుగా డ్రామా ఆడుతూ.. పెళ్లి వస్త్రాల మాటున డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకొస్తుంది ముఠా.. ఇది పసిగట్టిన రాచకొండ పోలీసులు.. గట్టుగా సాగుతోన్న ఈ వ్యాపారాన్ని రట్టు చేశారు..
Read Also: Central Government: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
Also Read
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
- TGPSC Notifications: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..
ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన రాచకొండ పోలీస్ కమిషన్ మహేష్ భగవత్.. చెన్నై నుంచి హైదరాబాద్, పుణె మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు సూడో ఎఫిడ్రీన్ డ్రగ్ను పంపిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.. ఇద్దరిని అరెస్ట్ చేసి 8.5 కిలోల సూడో ఎఫిడ్రైన్ స్వాధీనం చేసుకున్నాం.. సీజ్ చేసిన మొత్తం ప్రాపర్టీ విలువ 9 కోట్ల రూపాయలుగా ఉంటుందన్నారు.. మహమ్మద్ ఖాసీం, రసులుద్దీన్ ను అరెస్ట్ చేశాం.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. ఫేక్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులతో పట్టుబడ్డారని వెల్లడించారు.. లుంగీలు, ఫాన్సీ ఐటమ్స్ బాక్సుల్లో పార్సల్ చేసి కొరియర్లో బస్సుల్లో రోడ్డు మార్గం ద్వారా చేరవేస్తున్నారని.. వీటిలో డ్రగ్స్ తయారు చేసే ప్రాంతం.. డ్రగ్స్ నిల్వ ఉంచే ప్రాంతం.. తరలించే ప్రాంతం.. మూడు కీలకంగా ఉన్నాయన్నారు.. హైదరాబాద్ కేవలం డ్రగ్స్ ట్రాన్సిట్ ఏరియా మాత్రమే.. ఈ డ్రగ్ నుంచి మేటాంఫిటమైన్ తయారు చేస్తారని.. రాంరాజ్ ధోతి కోసం వాడే కాటన్ బాక్స్లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని.. ఒక్కో బాక్స్లో 80 నుంచి, 90 గ్రాముల ప్యాకెట్ పెడుతున్నారు. ఇలా ఏడు సార్లు పుణె నుంచి, ఎనిమిది సార్లు హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి అయినట్టు గుర్తించినట్టు వెల్లడించారు. ఇలా, ఇప్పటి వరకు 75 కిలోల డ్రగ్స్ దేశం దాటించారని.. ఫరీద్, ఫైసల్.. ఫుణె నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. సింథటిక్ డ్రగ్ కేజీకి కోటి ధర ఉండగా, మాటఫెటమినే కేజీ రూ5 కోట్లు విలువ చేస్తుందన్నారు సీపీ మహేష్ భగవత్..
తాజావార్తలు
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!