Nisha Jaiswal Success Story: ఆవు పేడతో లక్షలు.. నిషా జైస్వాల్ సక్సెస్ స్టోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nisha Jaiswal Success Story: కోవిడ్ మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేసింది. అలా కోవిడ్ కారణంగా ప్రభావితం అయిన వారిలో మధ్యప్రదేశ్లోని రేవా పట్టణంలోని నాకా ప్రాంతంలో నివసించే నిషా ఒకరు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో నిషా బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో ఆమె ఉద్యోగం కోసం వేచి ఎదురుచూడకుండా, కోవిడ్ సమయంలోనే తనే నలుగురికి ఉపాధిని ఇచ్చేలా ఒక స్టార్టప్ను ప్రారంభించింది. ఇంతకి ఆమె స్థాపించిన స్టార్టప్ ఏంటి, అసలు ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: AP Weather Alert: ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్..
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ఆవు పేడతో అలంకరణ ఉత్పత్తులు..
నిషా తండ్రి పంచాయతీ కార్యదర్శి, ఆమె తల్లి గృహిణి. ఆమెకు ఒక అక్క, చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సోదరుడు ఉన్నారు. నిషా రేవాలోని సెంట్రల్ అకాడమీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, భోపాల్లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత ఆమె బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించింది. కరెక్ట్గా అదే సమయానికి కోవిడ్ మహమ్మారి కారణంగా ఆమె తన చదువును మధ్యలో వదిలేసింది. ఇక దేని కోసం ఎదురుచూడకుండా తానే ఒక స్టార్టప్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. చిన్నప్పటి నుంచి తనకు, తన కుటుంబానికి ఆవులంటే చాలా అభిమానం అని నిషా తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు కొందరు చాలా కాలంగా ఆవులను పెంచుతున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆమెకు తన సొంత వెంచర్ను ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఆవు పేడతో అగరుబత్తులు తయారు చేయాలనే ఆలోచన చేసినట్లు నిషా పేర్కొంది. తన ఆలోచన రూపం దాల్చడానికి తన అన్నయ్య రూ.4 లక్షలు ఇచ్చి స్టార్టప్ ప్రారంభించడానికి సహాయం చేశాడంది.
తన స్టార్టప్ ప్రారంభించిన కొత్తలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వాటిని చూసి కుంగిపోలేదని చెప్పింది. అగరుబత్తుల అమ్మకం కొత్తలో వ్యాపారులకు తన అగరుబత్తులను ఇచ్చి వారి దుకాణాలలో నిల్వ చేయమని కోరేదని తెలిపింది. ఒకసారి నెలల పాటు ఉచితంగా అగరుబత్తులు ఇచ్చిందని పేర్కొంది.
ఇక్కడి నుంచే సక్సెస్..
వ్యాపారులకు ఉచితంగా అగరుత్తులు ఇవ్వడం అనే నిషా మార్కెట్ ప్లాన్ సక్సెస్ అయ్యింది. చివరికి వినియోగదారుల నుంచి అగరుబత్తులకు మంచి స్పందన లభించింది. ఆమె ఉత్పత్తి న్యాణమైనదని, గుర్తించిన ప్రజలు ఆమె విజయంలో కీ రోల్ ప్లే చేశారు. క్రమక్రమంగా మార్కెట్లో ఆమె అగరుబత్తులకు డిమాండ్ పెరగడంతో, నిషా క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించింది. ఆమె అగరుబత్తులను పెద్ద మొత్తంలో తయారు చేయడానికి ఒక ఆటోమేటిక్ యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఈక్రమంలో ఆమె తన స్టార్టప్లో కొంతమంది స్థానికులకు ఉపాధి కల్పించింది. ప్రతి సంవత్సరం ఆమె దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నట్లు, ఇప్పటి వరకు తన స్టార్టప్ రూ.5 నుంచి రూ.6 లక్షల లాభం సంపాదించిందని చెప్పారు. ఆవు పేడతో తయారు చేసిన సువాసన గల ధూపం కర్రలకు నిషా పేటెంట్ పొందింది. ఆమె తన బ్రాండ్కు ‘సాత్విక్’ అని పేరు పెట్టింది. తన తయారు చేసే ప్రాడక్ట్స్ పర్యావరణ అనుకూలంగా ఉంటాయని తెలిపింది. సాత్విక్ బ్రాండ్ వస్తువులు గులాబీ, లావెండర్, గుగ్గల్, పైనాపిల్, గంధపు చెక్క వంటి వివిధ సువాసనలలో లభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల ‘వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్’ పథకంలో కూడా ఎంపికైంది. ఈ పథకం కింద ఈ ఉత్పత్తులు రేవా రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇవే కాకుండా ఆమె ఇల్లు, కార్యాలయ అలంకరణ కోసం ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీపావళి సందర్భంగా ఇళ్లను అలంకరించడానికి ఆవు పేడతో తయారు చేసిన ఆకర్షణీయమైన దియాలను, పర్యావరణ అనుకూల రాఖీలతో సహా అనేక ఉత్పత్తులను తయారు ఆమె చేస్తున్నారు. నిషా తన ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ వాణిజ్య వేదికలలో త్వరలో విక్రయించాలని చూస్తున్నట్లు తెలిపారు. నిషా ప్రస్థానం ఎందరో యువతులకు ప్రేరణగా నిలుస్తుంది.
READ MORE: Sai Durga Tej : తెలుగులో స్టైలిష్ హీరో అతనే.. సాయిదుర్గ తేజ్ కామెంట్స్
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!