Nestle India: నెస్ట్లే ఇండియా ‘లాభాల’ మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nestle India: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్ట్లే ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను నమోదు చేసింది. మార్చి 2026తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 27 శాతం వృద్ధి చెంది రూ. 1,111 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో ఈ లాభం రూ. 873 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్కెట్ నిపుణులు అంచనా వేసిన రూ. 926 కోట్లను నెస్టలే భారీ తేడాతో క్రాస్ చేసింది. కేవలం లాభాల్లోనే కాకుండా ఆదాయంలోనూ కంపెనీ 23 శాతం వృద్ధిని సాధించి రూ. 6,748 కోట్ల మార్కును అందుకుంది. ముఖ్యంగా మ్యాగీ, కిట్క్యాట్ వంటి బ్రాండ్ల పట్ల వినియోగదారులు చూపిస్తున్న ఆదరణతో దేశీయ అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా రూ.6,445 కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
READ ALSO: History: పూర్వం ఏసీలు, కూలర్లు లేవు కదా? మరి అంత ఎండలో రాజులు, చక్రవర్తులు ఎలా బ్రతికారు?
Also Read
- Windfall Tax: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్ను తగ్గింపు.. ఎవరికి లాభం?
- Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
ఈ మెరుగైన ప్రదర్శనకు ప్రధాన కారణం కంపెనీ అనుసరించిన మార్కెటింగ్ వ్యూహాలేనని నెస్ట్లే ఇండియా సీఎండీ మనీష్ తివారీ పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో ప్రకటనల కోసం చేసే ఖర్చును కంపెనీ 50 శాతానికి పైగా పెంచినప్పటికీ, సమర్థవంతమైన నిర్వహణ వల్ల ఎబిటా (EBITDA) మార్జిన్లను 26.3 శాతంగా స్థిరంగా ఉంచుకోగలిగింది. అద్భుతమైన వృద్ధిని సాధించిన తరుణంలో వాటాదారులకు కూడా కంపెనీ తీపి కబురు అందించింది. ప్రతి షేరుకు రూ.5 చొప్పున ఫైనల్ డివిడెండ్ను బోర్డు సిఫార్సు చేయగా, దీని కోసం జూలై 10వ తేదీని రికార్డ్ డేట్గా నిర్ణయించింది.
నెస్ట్లే ప్రకటించిన ఈ బంపర్ ఫలితాలతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎగబడి షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీ షేరు విలువ 7 శాతం మేర పెరిగి రూ.1,379.90 వద్ద కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. స్టాండ్లోన్ ప్రాతిపదికన కూడా కంపెనీ లాభం 26 శాతం పెరిగి రూ.1,114 కోట్లుగా నమోదవ్వడం విశేషం. మొత్తం మీద పెరుగుతున్న ముడి సరుకుల ధరల సవాళ్లను అధిగమిస్తూ, భారీ ప్రకటనల ఖర్చు చేసినా లాభదాయకతను కాపాడుకోవడంలో నెస్ట్లే విజయం సాధించింది.
READ ALSO: SRH vs DC: ఉప్పల్లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
తాజావార్తలు
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!