Nestle India: నెస్ట్లే ఇండియా ‘లాభాల’ మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nestle India: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్ట్లే ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను నమోదు చేసింది. మార్చి 2026తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 27 శాతం వృద్ధి చెంది రూ. 1,111 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో ఈ లాభం రూ. 873 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్కెట్ నిపుణులు అంచనా వేసిన రూ. 926 కోట్లను నెస్టలే భారీ తేడాతో క్రాస్ చేసింది. కేవలం లాభాల్లోనే కాకుండా ఆదాయంలోనూ కంపెనీ 23 శాతం వృద్ధిని సాధించి రూ. 6,748 కోట్ల మార్కును అందుకుంది. ముఖ్యంగా మ్యాగీ, కిట్క్యాట్ వంటి బ్రాండ్ల పట్ల వినియోగదారులు చూపిస్తున్న ఆదరణతో దేశీయ అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా రూ.6,445 కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
READ ALSO: History: పూర్వం ఏసీలు, కూలర్లు లేవు కదా? మరి అంత ఎండలో రాజులు, చక్రవర్తులు ఎలా బ్రతికారు?
Also Read
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
- Adani Aluminium: అదానీ నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు పెద్ద కంపెనీలేనా? ఏకంగా రూ. 1.1 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ సరికొత్త ప్లాన్!
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
ఈ మెరుగైన ప్రదర్శనకు ప్రధాన కారణం కంపెనీ అనుసరించిన మార్కెటింగ్ వ్యూహాలేనని నెస్ట్లే ఇండియా సీఎండీ మనీష్ తివారీ పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో ప్రకటనల కోసం చేసే ఖర్చును కంపెనీ 50 శాతానికి పైగా పెంచినప్పటికీ, సమర్థవంతమైన నిర్వహణ వల్ల ఎబిటా (EBITDA) మార్జిన్లను 26.3 శాతంగా స్థిరంగా ఉంచుకోగలిగింది. అద్భుతమైన వృద్ధిని సాధించిన తరుణంలో వాటాదారులకు కూడా కంపెనీ తీపి కబురు అందించింది. ప్రతి షేరుకు రూ.5 చొప్పున ఫైనల్ డివిడెండ్ను బోర్డు సిఫార్సు చేయగా, దీని కోసం జూలై 10వ తేదీని రికార్డ్ డేట్గా నిర్ణయించింది.
నెస్ట్లే ప్రకటించిన ఈ బంపర్ ఫలితాలతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎగబడి షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీ షేరు విలువ 7 శాతం మేర పెరిగి రూ.1,379.90 వద్ద కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. స్టాండ్లోన్ ప్రాతిపదికన కూడా కంపెనీ లాభం 26 శాతం పెరిగి రూ.1,114 కోట్లుగా నమోదవ్వడం విశేషం. మొత్తం మీద పెరుగుతున్న ముడి సరుకుల ధరల సవాళ్లను అధిగమిస్తూ, భారీ ప్రకటనల ఖర్చు చేసినా లాభదాయకతను కాపాడుకోవడంలో నెస్ట్లే విజయం సాధించింది.
READ ALSO: SRH vs DC: ఉప్పల్లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
తాజావార్తలు
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
-
Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Women Financial Assistance: మహిళలకు గుడ్ న్యూస్.. ఇక, నెలకు రూ.2,500.. అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!